‘షీ సేఫ్’ యాప్‌ను ప్రారంభించిన సాయిప‌ల్ల‌వి

  • IndiaGlitz, [Thursday,February 20 2020]

సైబ‌రాబాద్ ఐటీ కారిడార్‌లోని మ‌హిళ భ‌ద్ర‌త కోసం రూపొందించిన షీ సేఫ్ అనే ప్ర‌త్యేక‌మైన యాప్‌ను గురువారం హీరోయిన్ సాయిప‌ల్ల‌వి ప్రారంభించారు. హెచ్ఐఐసీలో సైబ‌రాబాద్ పోలీసులు, సోసైటీ ఫ‌ర్ సెక్యూరిటీ కౌన్సిల్ క‌ల‌యిక‌లో స‌ద‌స్సు జ‌రిగింది. ఈ సద‌స్సులో సైబ‌రాబాద్ పోలీస్ క‌మీష‌న‌ర్ స‌జ్జ‌నార్‌, ఇన్సెపెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ స్వాతి ల‌క్రా, టెస్సీ థామ‌స్ త‌దిత‌రులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా న‌గ‌రంలో మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న అఘాయిత్యాల‌ను నివారించ‌డానికి షీ సేఫ్ యాప్‌ను ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా సాయిప‌ల్ల‌వి మాట్లాడుతూ ‘‘హైద‌రాబాద్‌లో మ‌హిళ‌ల‌కు ఉన్న భ‌ద్ర‌త మ‌రెక్క‌డా లేదు. మ‌హిళ‌ల భ‌ద్ర‌త కోసం తెలంగాణ పోలీసులు ఎంత‌గానో కృషి చేశారు. ఇప్పుడు వారు షీ సేఫ్ యాప్‌తో భ‌ద్ర‌త కోసం మ‌న‌కు మ‌రింత చేరువ‌య్యారు. వారి అండ‌దండ‌ల‌తో మ‌హిళ‌లు నిశ్చితంగా ఉంటున్నారు. పోలీసుల‌కు స‌హ‌క‌రించ‌డం మ‌న బాధ్య‌త‌’’అని తెలిపారు. నాగ‌చైత‌న్య‌తో సాయిప‌ల్ల‌వి క‌లిసి ‘ల‌వ్‌స్టోరి’ అనే చిత్రంలో న‌టిస్తుంది. ఈ సినిమా ఏప్రిల్ 2న విడుద‌ల కానుంది. అలాగే రానాతో క‌లిసి వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వంలో ‘విరాట‌ప‌ర్వం’ సినిమాలోనూ న‌టిస్తున్నారు.

More News

సాయితేజ్ నిర్మాత డైల‌మా!!

`చిత్ర‌ల‌హ‌రి`.. త‌ర్వాత రీసెంట్‌గా విడుద‌లైన `ప్ర‌తిరోజూ పండ‌గే` చిత్రాలు హిట్ సాధించ‌డంతో మ‌ళ్లీ మెగా క్యాంప్ హీరో సాయితేజ్ స‌క్సెస్ ట్రాక్‌లో ప‌డ్డాడు.

తెర‌పైకి మ‌రాఠా యోధుడి చిత్రం

భార‌తదేశంలో హిందుత్వ ఉనికి కోసం నాటి మొఘ‌లు చ‌క్ర‌వ‌ర్తుల‌తో పోరాటం చేసిన మ‌రాఠా యోధుడు ఛ‌త్ర‌ప‌తి శివాజీ.

నేనెవరో తెలీదా.. జగన్ సెక్యూరిటీతో బైరెడ్డి సిద్ధార్థ్‌ వాగ్వాదం!

యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. వయసు చిన్నదే అయినప్పటికీ మాస్ ఫాలోయింగ్ ఉన్న ఈ యువకుడు కర్నూలు జిల్లాలో కీలకంగా ఉన్నాడు.

‘ఆర్ఆర్ఆర్’ కోసం బాలీవుడ్ టెక్నిక్‌లో రాజ‌మౌళి..!

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ క‌థానాయ‌కులుగా న‌టిస్తోన్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్‌’. డి.వి.వి.దాన‌య్య నిర్మాత‌.

ప్రాణాలతో బయటపడ్డా.. తెలిసొచ్చింది: కాజల్

విలక్షణ నటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘భారతీయుడు-2’.