కొరియోగ్రాఫ‌ర్‌గా సాయిప‌ల్ల‌వి

  • IndiaGlitz, [Tuesday,July 14 2020]

తెలుగులో ఫిదా చిత్రంతో ప్రేక్ష‌కుల హృద‌యాల్ని దోచుకున్న సాయిప‌ల్లవి త‌ర్వాత ఏంసీఏ, క‌ణం త‌దిత‌ర చిత్రాల్లో త‌న‌దైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది. అలాగే త‌మిళంలోనూ కొన్ని సినిమాల్లోనూ న‌టించింది. ఇప్పుడు తెలుగులో రానా ద‌గ్గుబాటి జ‌త‌గా విరాట‌ప‌ర్వం సినిమాలో న‌టిస్తుంది. దీనికంటే ముందుగా నాగ‌చైత‌న్య జోడీగా శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ల‌వ్‌స్టోరి సినిమాలో న‌టించింది. ఈ సినిమా ఫైన‌ల్ షెడ్యూల్‌లో ప‌దిహేను రోజుల్లో చిత్రీక‌ర‌ణ మిగిలి ఉంది. ఈ పార్ట్‌ను రామోజీ ఫిలింసిటీలో ప్లాన్ చేశారు శేఖ‌ర్ క‌మ్ముల‌. ఇందులో ఓ పాట‌ను కూడా చిత్రీక‌రించాల్సి ఉంది.

అంతా బాగానే ఉంది. కానీ.. ఈ పాట‌కు కొరియోగ్ర‌ఫీ కంపోజ్ చేయ‌మ‌ని శేఖ‌ర్ క‌మ్ముల సాయిప‌ల్ల‌వికి చెప్పార‌ట‌. మంచి డాన్స‌ర్ అయిన సాయిప‌ల్ల‌వి ఓకే అంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇది నిజ‌మైతే ఒక ప‌క్క డాన్స్ మాస్ట‌ర్‌గా, మ‌రో వైపు హీరోయిన్‌గా ల‌వ్‌స్టోరిలో సాయిప‌ల్ల‌వి సంద‌డి చేస్తుంద‌న్న‌మాట‌. ఇది నిజంగా ఆమెను అభిమానించే వారికి మంచి విష‌య‌మే. ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే పూర్తి చేసినా విడుద‌ల మాత్రం వ‌చ్చే ఏడాదిలోనే చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేశార‌ని టాక్ విన‌ప‌డుతోంది.

More News

యూత్‌కి షాకిస్తున్న కరోనా తాజా అధ్యయనాలు

కరోనాపై రోజురోజుకూ వెలువడుతున్న అధ్యయనాలు ఒక్కొక్క అపోహనూ కొట్టి పారేస్తున్నాయి. ఇప్పటికే కరోనా మళ్లీ మళ్లీ సోకే అవకాశముందంటూ షాక్ ఇవ్వగా..

అందుకే ‘పుష్ప’ నుంచి తప్పుకున్నా: విజయ్ సేతుపతి

నటనతో అభిమానులను సంపాదించుకునే హీరోలు చాలా తక్కువగా ఉంటారు. వారిలో కోలివుడ్ స్టార్ విజయ్ సేతుపతి ఒకరు.

తెలంగాణలో జ‌రిగిన య‌దార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ల‌వ్ స్టోరీ.. 'అస‌లేం జ‌రిగింది? 'థియేట‌ర్లా?? లేక ఓటీటీయా??

తెలంగాణ‌లో జ‌రిగిన య‌దార్థ సంఘ‌ట‌ల ఆధారంగా రూపొందించిన స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ల‌వ్ స్టోరీ 'అస‌లేం జరిగింది' 

మ‌ణిర‌త్నంతో సూర్య‌!!

ఇండియ‌న్ ఏస్ డైరెక్ట‌ర్స్‌లో మ‌ణిర‌త్నం పేరు ఎప్పుడూ టాప్‌లో ఉంటుంది. ఈ ద‌ర్శ‌క నిర్మాత హీరో సూర్య‌తో గ‌తంలో యువ సినిమాను రూపొందించిన సంగ‌తి తెలిసిందే.

‘లూసిఫ‌ర్’ రీమేక్‌‌లో రెహ‌మాన్‌

చిరు 153వ చిత్రంగా మ‌ల‌యాళ చిత్రం ‘లూసిఫర్’ను రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే.