సాయితేజ్ - సుకుమార్ రైటింగ్స్ కొత్త‌ చిత్రం

  • IndiaGlitz, [Friday,August 14 2020]

కెరీర్ ప్రారంభం నుండి వైవిధ్య‌మైన చిత్రాలు చేస్తూ త‌న‌కంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న సుప్రీమ్ హీరో సాయితేజ్ క‌థానాయ‌కుడిగా కొత్త చిత్రాన్ని ప్ర‌క‌టించారు. భారీ హిట్ చిత్రాల‌కు కేరాఫ్ అయిన శ్రీవెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పీ, వైవిధ్య‌మైన క‌థాంశాల‌ను ప్రాధాన్య‌మిచ్చే సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్స్‌పై స్టార్ ప్రొడ్యూస‌ర్‌ బీవీఎస్ఎన్‌.ప్ర‌సాద్ నిర్మాత‌గా ఈ చిత్రం రూపొంద‌నుంది. ఈ సినిమా అనౌన్స్ మెంట్ పోస్ట‌ర్‌ను శుక్రవారం విడుద‌ల చేశారు.

ఈ పోస్ట‌ర్‌లో ‘సిద్ధార్థి నామ సంవత్సరే, బృహ‌స్ప‌తిః సింహరాశౌ స్థిత న‌మ‌యే, అంతిమ పుష్క‌రే’ అని సంస్కృతంలోని వాక్యంతో పాటు ష‌ట్‌చ‌క్రంలో ఓ క‌న్ను చూపిస్తున్నారు. అస‌లు ఈ క‌న్ను, ష‌ట్‌చ‌క్రం, సంస్కృత వాక్యం వెనకున్న క‌థేంట‌నే అంశాలు ఆస‌క్తిక‌రంగా మారాయి. మిస్టీక్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్క‌నున్న ఈ చిత్రాన్ని సుకుమార్ రచన శాఖ‌లో ప‌నిచేసిన కార్తీక్ దండు తెర‌కెక్కిస్తున్నారు. బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. 

ఈ చిత్రంలో హీరోయిన్‌, ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వరలో తెలియ‌జేస్తామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది

More News

దేవాక‌ట్ట జాగ్ర‌త్త‌....

డైరెక్ట‌ర్ దేవాక‌ట్ట ఈసారి కాస్త జాగ్ర‌త్తప‌డ్డారు. ఆయ‌న త‌దుప‌రి చేయ‌బోయే సినిమాకు సంబ‌బంధించిన థీమ్ మోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు.

మెగా డాటర్ నిశ్చితార్థం.. ఆ లోటు మాత్రం కనిపించింది..

మెగా డాటర్ నిహారిక నిశ్చితార్థం జొన్నలగడ్డ చైతన్యతో వైభవంగా జరిగింది. గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్ రావు కుమారుడైన చైతన్యతో

వచ్చేసింది.. త్వరలో వస్తా.. ప్లాస్మా ఇస్తా: అజయ్ భూపతి

టాలీవుడ్‌ని కరోనా మహమ్మారి వదిలేలా లేదు. ఇటీవల కరోనా కారణంగా తరచూ తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు వార్తల్లో నిలుస్తున్నారు.

ఏపీలో ఆగని కరోనా విజృంభణ.. నేడు పాజిటివ్ కేసులకు సమానంగా..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది.

ఎమ్మెల్యే అచ్చెన్నాయుడికి కరోనా పాజిటివ్..

ఏపీలో కరోనా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి రాష్ట్రంలో అన్ని జిల్లాలకూ విస్తరించింది.