సాయితేజ్ నిర్మాత డైల‌మా!!

  • IndiaGlitz, [Thursday,February 20 2020]

'చిత్ర‌ల‌హ‌రి'.. త‌ర్వాత రీసెంట్‌గా విడుద‌లైన 'ప్ర‌తిరోజూ పండ‌గే' చిత్రాలు హిట్ సాధించ‌డంతో మ‌ళ్లీ మెగా క్యాంప్ హీరో సాయితేజ్ స‌క్సెస్ ట్రాక్‌లో ప‌డ్డాడు. ఇప్పుడు ఇత‌న తాజా చిత్రం 'సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌' చిత్రంపై అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది. ఈ చిత్రాన్నిడెబ్యూ డైరెక్ట‌ర్ సుబ్బుతో బీవీఎస్ఎన్ ప్ర‌సాద్ నిర్మిస్తున్నాడు. రీసెంట్‌గా విడుదలైన ప్రోమోతో ఈ అంచ‌నాలు మ‌రింత పెరిగాయి. దీంతో నిర్మాత దిల్‌రాజు, యువీ క్రియేష‌న్స్ సినిమాను 17 కోట్ల‌కు థియేట్రిక‌ల్ రైట్స్ ఇచ్చేయ‌మ‌ని అడుగుతున్నాయ‌ట‌. మార్కెటింగ్ ప‌రంగా ఇది మంచి ధ‌రే అయినా బీవీఎస్ఎన్ చిన్న డైల‌మాలో ఉన్నాడ‌ట‌.

వివ‌రాల్లోకెళ్తే.. సాధార‌ణంగా ఓ నిర్మాత‌కు కొంత మంది ప‌క్కా డిస్ట్రిబ్యూట‌ర్స్ స‌పోర్ట్ చేస్తుంటారు. సినిమా లాభ‌న‌ష్టాల్లోనూ నిర్మాత‌కు వారి అండ‌దండ‌లు ఉంటాయి. నిర్మాత బీవీఎస్ఎన్ ప్ర‌సాద్‌కు కూడా అలాంటి కోట‌రి ఉంది. తొలి ప్రేమ సినిమా చేసినప్పుడు సినిమాను ఇలా ఔట్ రేట్‌కి అమ్మేయ‌డంతో స‌ద‌రు కోట‌రికీ, బీవీఎస్ఎన్‌కి మ‌ధ్య దూరం పెరిగింది. త‌ర్వాత బీవీఎస్ఎన్ చేసిన మిస్ట‌ర్ మ‌జ్నుపై ఈ ఎఫెక్ట్ ప‌డటంతో ఈ భారీ నిర్మాత‌కు న‌ష్టాలు త‌ప్ప‌లేదు. అయితే ఇప్పుడు కూడా త‌న కోట‌రినీ ఏం చేయాలా? అని బీవీఎస్ఎన్ ఆలోచిస్తున్నాడని సినీ వ‌ర్గాల స‌మాచారం.