'బ్యాడ్‌బాయ్‌' పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసిన బాలీవుడ్ సూప‌ర్ స్టార్ స‌ల్మాన్‌ఖాన్‌

  • IndiaGlitz, [Saturday,May 23 2020]

ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు మిథున్ చ‌క్ర‌వ‌ర్తి త‌న‌యుడు న‌మాషి చ‌క్ర‌వ‌ర్తి, అమ్రిన్ ఖురేషి తారాగ‌ణంగా రాజ్‌కుమార్ సంతోషి రూపొందిస్తోన్న చిత్రం ‘బ్యాడ్‌బాయ్‌’. డా.జ‌యంతీలాల్ గ‌డ‌(పెన్‌), ఇన్‌బాక్స్ పిక్చ‌ర్స్ ప‌తాకాలు ఈ చిత్రాన్ని స‌మ‌ర్పిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా పెన్ మ‌రుద‌ర్ సినీ ఎంట‌ర్‌టైన్మెంట్స్ విడుద‌ల చేస్తుంది. ప్ర‌తి సినిమాను రాజ్‌కుమార్ సంతోషి ఓ సెల‌బ్రేష‌న్‌లా తెర‌కెక్కిస్తుంటార‌నే సంగ‌తి తెలిసిందే. గ‌త ముప్పై ఏళ్లుగా గ్లోబెల్ సినిమాలో ఇండియ‌న్ చిత్రాల గొప్ప వ‌రుస‌లో ఆయ‌న రూపొందించిన చిత్రాలున్నాయి. ఆయ‌న రూపొందించిన మ‌రో ఐకాన్ మూవీగా బ్యాడ్‌బాయ్ పోస్ట‌ర్‌ను బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ స‌ల్మాన్‌ఖాన్ విడుద‌ల చేశారు.

2020లో రూపొందుతోన్న బాలీవుడ్ మ‌సాలా చిత్రంగా బ్యాడ్‌బాయ్ రూపొందుతోందని, ఎంజాయ్‌మెంట్‌, ఫన్ అంశాల‌తో సినిమా ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌లా తెర‌కెక్క‌తోంద‌ని నిర్మాత‌లు తెలిపారు. రాజ్‌కుమార్ సంతోషి రూపొందించిన సినిమాల‌న్నింటిలో బ్యాడ్‌బాయ్ చిత్రం చాలా మంచి స్క్రిప్ట్‌, కొత్త హీరో హీరోయిన్స్‌, గొప్ప సంగీతం, డ్రామా త‌దిత‌ర అంశాల‌తో తెరకెక్కింది. ఈ సినిమా పోస్ట‌ర్‌లో బ్యాడ్ బాయ్‌గా న‌మాషి చ‌క్ర‌వ‌ర్తి, బ్యాడ్ గ‌ర్ల్ పాత్ర‌లో అమ్రిన్ ఖురేషి క‌నిపిస్తున్నారు. సినిమా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. పోస్ట‌ర్ చూస్తుంటే రాజ్‌కుమార్ సంతోషి మార్క్ మాస్ట‌ర్ పీస్‌లా అనిపిస్తుంది. రాజ్‌కుమార్ సంతోషి నుండి వ‌స్తున్న మ‌రో సూప‌ర్‌హిట్ అని అంద‌రూ భావిస్తున్నారు.

ఈ చిత్రానికి నిర్మాత‌లు: సాజిద్ ఖురేషీ, దావ‌ల్ జ‌యంతీ లాల్ గ‌డ‌, అక్ష‌య్ జ‌యంతీ లాల్ గ‌డ‌

More News

మ‌రోసారి గాంధీజీపై సెన్సేష‌న‌ల్ ట్వీట్ చేసిన నాగ‌బాబు

మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబు ట్విట్ట‌ర్ వేదికగా సెన్సేష‌న్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇటీవ‌ల ఆయ‌న నాధూరాం గాడ్సేకు అనుకూలంగా చేసిన ట్వీట్స్‌పై పెద్ద దుమార‌మే రేగింది.

నిర్మాత రిక్వెస్ట్.. మారుతి వెబ్ సిరీస్‌

ఓటీటీ మాధ్య‌మాలు జోరును ముందుగానే ఊహించిన తెలుగు నిర్మాత‌ల్లో అల్లు అర‌వింద్ ఒక‌రు. అందుక‌నే ఆయ‌న తెలుగులో ఆహా అనే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ను సిద్ధం చేసి తీసుకొచ్చారు.

శేఖర్ కమ్ముల నెక్స్ట్ సినిమా కన్ఫార్మ్

సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తర్వాతి సినిమా కన్ఫార్మ్ అయ్యింది.ప్రస్తుతం నాగ చైతన్య, సాయి పల్లవి లతో 'లవ్ స్టోరీ' మూవీ చేస్తున్న కమ్ముల ఆ మూవీ షూటింగ్ ఇంకో 15 రోజుల షూటింగ్ మిగిలి ఉండగానే..

సీనియర్ నటి వాణిశ్రీకి పుత్రశోకం

సీనియర్ నటి వాణిశ్రీ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఇవాళ ఉదయం వాణిశ్రీకి పుత్రశోకం కలిగింది. ఆమె కుమారుడు డాక్టర్ అభినయ్ వెంకటేశ్ చెన్నైలోని తన ఇంట్లో చనిపోయారు.

టీటీడీ ఆన్‌లైన్ సేవ‌ల వెబ్‌సైట్ మార్పు వెనుక..!

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు ఆన్‌లైన్ సేవలు కూడా అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే.