పారిస్‌లోని పలు సుందరమైన ప్రదేశాలలో 'సామజవరగమన' చిత్రీకరణ

  • IndiaGlitz, [Friday,November 08 2019]

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తోన్న సినిమా 'అల వైకుంఠపురంలో'. ప్రసిద్ధ నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు), లు ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన సామజవరగమన పాట తెలుగునాట ఎంతటి సంచలనాన్ని నమోదు చేసిందో తెలిసిందే. ఇప్పటికీ అప్రతిహతంగా దూసుకుపోతూనే ఉంది. సామాజిక మాధ్యమాలలో కొంగొత్త రికార్డులను సృష్టిస్తూ మోస్ట్ వాచ్డ్ సాంగ్ ఇన్ సౌత్ ఇండియా గా నిలిచింది. శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం,సంగీత దర్శకుడు తమన్ అందించిన సంగీతం, ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాయి.

ఆడియో పరంగా ఇంతటి సెన్సేషన్ సృష్టించిన ఈ సాంగ్ ను ప్రస్తుతం పారిస్‌లోని పలు అందమైన ప్రదేశాలలో చిత్రీకరిస్తున్నారు. స్టైలిష్ స్టార్ 'అల్లుఅర్జున్, పూజ హెగ్డే' లపై చిత్రీకరిస్తున్న ఈ అందమైన గీతానికి ,శేఖర్ మాస్టర్ నృత్య రీతులు సమకూరుస్తున్నారు. పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన భారీ నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’, ‘గీతాఆర్ట్స్’ కాంబినేషన్ లో సంక్రాంతి కానుకగా జనవరి 12న 'అల వైకుంఠపురంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

అల వైకుంఠపురములోని తారలు: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్,పూజ హెగ్డే,టబు,రాజేంద్రప్రసాద్,సచిన్ ఖేడ్ కర్,తనికెళ్ళ భరణి,మురళీ శర్మ, సముద్ర ఖని,జయరాం,సునీల్,నవదీప్,సుశాంత్,నివేతా పేతురాజ్,గోవిందాపద్మసూర్య,రోహిణి,ఈశ్వరీరావు,కల్యాణినటరాజన్,శిరీష,బ్రహ్మాజీ,హర్షవర్ధన్,అజయ్, పమ్మిసాయి,రాహుల్ రామకృష్ణ నటిస్తున్నారు.

More News

డిసెంబర్‌ 6న 'పానిపట్‌' విడుదల

భారతదేశ చరిత్రలో పానిపట్‌ యుద్దాలకు ఉన్న ప్రత్యేకత అందరికీ తెలిసిందే. మూడవ పానిపట్‌ యుద్ధం కథాంశంగా రూపొందుతున్న పీరియాడికల్‌ మూవీ 'పానిపట్‌.

చిరు ‘రుద్రవీణ’ పాటలు వైసీపీ నేతలకు మేలుకొలుపు!

టాలీవుడ్‌లో అప్పట్లో.. మాస్ హీరోగా దూసుకుపోతున్న రోజుల్లో చిరంజీవి తన స్టార్ ఇమేజ్‌ను పక్కన పెట్టి ఒక సామాన్య పాత్రలో అసామాన్య చిత్రం ‘రుద్రవీణ’. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు బాలచందర్ తెరకెక్కించారు.

జక్కన్న ‘RRR’ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్!

ఓటమి ఎరుగని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం RRR. ఇప్పటికే భారీ చిత్రాలతో ఇండియన్ రికార్డ్స్‌ను బద్దలు కొట్టిన జక్కన్న మరోసారి

మద్యం నియంత్రణపై వైఎస్ జగన్ కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు మద్యం నియంత్రణపై సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

చివరిదశలో ఉన్న ‘జేసీ’తో మాకేం పని: మంత్రి నాని

టీడీపీ ముఖ్యనేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.