సముద్రంలో స‌మంత సాహ‌సం

  • IndiaGlitz, [Monday,November 23 2020]

స‌మంత అక్కినేని.. పెళ్లి త‌ర్వాత సినిమాల్లో న‌టిస్తుంది. కానీ, గ‌త ఏడాది ‘ఓ బేబి’ స‌క్సెస్ త‌ర్వాత మ‌రో సినిమాలో మాత్రం ఇంత వ‌ర‌కు న‌టించ‌లేదు స‌రిక‌దా.. ఆమె న‌టించ‌బోయే నెక్ట్స్ మూవీకి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వెలువ‌డ‌లేదు. లాక్‌డౌన్ స‌డ‌లింపుల త‌ర్వాత స్టార్స్ అందరూ సెట్స్‌లోకి వెళ్ల‌డానికి ఆస‌క్తి చూపిస్తుంటే స‌మంత మాత్రం వెకేష‌న్ మోడ్‌లో ఉంది. ప్ర‌స్తుతం ఈ అక్కినేని వారి కోడ‌లు మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తుంది. కేవ‌లం ఎంజాయ్‌మెంటో కాదండోయ్ సాహ‌సాలు కూడా చేస్తున్న‌ట్లు త‌న ఇన్‌స్టా ద్వారా తెలియ‌జేసింది సామ్‌. మాల్దీవుల స‌ముద్రంలో అండ‌ర్‌వాట‌ర్‌లోకి వెళ్లి సాహం చేసిన‌ట్లు స‌మంత తెలియ‌జేయ‌డ‌మే కాకుండా దానికి సంబంధించిన ఫొటోను కూడా షేర్ చేసింది.

ప్రస్తుతం సమంత డిజిటల్ మాధ్యమంలోకి ‘సామ్‌జామ్’ అనే ప్రోగ్రామ్ ద్వారా హోస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అలాగే బిగ్‌బాస్‌లోనూ ఓ ఎపిసోడ్‌కు వ్యాఖ్యాత‌గానూ స‌మంత అల‌రించింది. అలాగే త్వరలోనే నందినీ రెడ్డి దర్శకత్వంలో ఓ హారర్ థ్రిల్లర్ సినిమాలో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో సినిమా రూపొంద‌నున్న ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డుతుంద‌ని స‌మాచారం.