సిద్ధార్థ్‌తో రిలేష‌న్ గురించి స‌మంత ఏం చెప్పిందో తెలుసా?

  • IndiaGlitz, [Thursday,March 19 2020]

హీరోయిన్‌గా స‌మంత కెరీర్ ప్రారంభంలో మంచి విజ‌యాలు సాధించి స్టార్ హీరోయిన్‌గా మంచి గుర్తింపునే సంపాదించుకుంది. అదే స‌మ‌యంలో హీరో సిద్ధార్థ్‌తో కొంత‌కాలం రిలేష‌న్ షిప్ కొన‌సాగించింది. వీరిద్ద‌రూ క‌లిసి జంట‌గా ప‌లు సంద‌ర్భాల్లో కెమెరాల కంటికి చిక్కారు. అప్ప‌ట్లో వీరి రిలేష‌న్ గురించి ప‌లు వార్త‌లు వినిపించాయి. అయితే ఏమైందో కానీ.. ఇద్ద‌రికీ బ్రేక‌ప్ అయ్యింది. త‌న బ్రేక‌ప్ గురించి స‌మంత ఎక్క‌డా నోరు మెద‌ప‌లేదు. త‌ర్వాత నాగ‌చైత‌న్య‌తో ప్రేమ‌లో ప‌డిన స‌మంత అక్కినేని వారింటి కోడ‌లుగా మారింది.

ఇన్నేళ్ల త‌ర్వాత ఓ ఇంట‌ర్వ్యూలో సిద్ధార్థ్‌తో బ్రేక‌ప్ గురించి మాట్లాడుతూ త‌న జీవితంలో ఎదురైన చేదు అనుభ‌వ‌మ‌ని చెప్పింది. ‘‘సావిత్రిగారి త‌ర‌హాలో నేను కూడా మాన‌సిక సంఘ‌ర్ష‌ణ‌లో ప‌డిపోయేదాన్ని. అయితే నా రిలేష‌న్ షిప్ కొన‌సాగితే బాధే మిగులుతుంద‌నే నిజాన్ని దేవుడి ద‌య వ‌ల్ల‌ గ్ర‌హించాను. అందువ‌ల్ల రిలేష‌న్ షిప్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చేశాను. త‌ర్వాత నాగ‌చైత‌న్య నా జీవితంలోకి ప్ర‌వేశించారు. త‌ను అద్భుత‌మైన వ్య‌క్తి’’ అన్నారు. 2017లో నాగ‌చైత‌న్య‌, స‌మంత పెళ్లి చేసుకున్నారు. పెళ్లి త‌ర్వాత కూడా స‌మంత సినిమాల్లో న‌టిస్తున్నారు.

More News

కరోనా విషయంలో రూల్స్ పాటించండి..: నిశ్శబ్దం టీమ్

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. చైనాలోని వూహాన్‌లో పుట్టిన ఈ వైరస్ ప్రపంచ దేశాలకు పాకింది. ఇప్పటికే 271 దేశాలకు పాకినట్లు నిపుణులు చెబుతున్నారు.

లీకుల‌పై మెగాస్టార్ అస‌హ‌నం?

మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా ‘ఆచార్య‌’ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

కరోనా భయంతో మాస్క్ పెట్టుకోవడం అవసరమా!?

కరోనా వైరస్ (కోవిడ్-19) ప్రభావం రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరు ఒక్కరకంగా జాగ్రత్తలు చెబుతుండటం..

కరోనా మాటలపై జగన్‌కు నోబెల్ ఫ్రైజ్ ఇవ్వాలి : చంద్రబాబు

ఇదేంటి.. టైటిల్ చూడకుండానే సీఎం జగన్ మోహన్ రెడ్డికి నోబెల్ ఫ్రైజ్ ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఇవ్వమని అడగడమేంటి..?

నాకు ప్రాణ హాని ఉంది.. రక్షణ కల్పించండి..: నిమ్మగడ్డ రమేష్

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా పడిన తర్వాత రగడ నెలకొన్న సంగతి తెలిసిందే.