విడాకుల తర్వాత తొలి సినిమా అనౌన్స్‌మెంట్.. పోస్టర్‌లో డల్‌గా సమంత...!!

  • IndiaGlitz, [Friday,October 15 2021]

సమంత-నాగచైతన్య విడాకుల షాక్ నుంచి సినీ పరిశ్రమ, ప్రజలు ఇంకా తేరుకోలేదు. ఆమెకు సంబంధించిన ఏ చిన్న వార్త వచ్చినా అది ప్రస్తుతం వైరలయి కూర్చొంటోంది. ఇంకా అక్కినేని జంట విడాకులకు దారి తీసిన కారణాలేంటీ అన్నదానిపై క్లారిటీ లేదు. అది తెలుసుకోవాలని ఎంతో మంది ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో విడాకుల తర్వాత సమంత సినిమాల్లో నటిస్తుందా..? లేక ఫుల్‌స్టాప్ పెట్టేస్తుందా..? లేదంటే కొన్నాళ్లు గ్యాప్ ఇచ్చి మళ్లీ ఎంట్రీ ఇస్తుందా..? అసలు తెలుగులో సినిమాలు చేస్తుందా..? ఇలా రకరకాలుగా సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దసరా సందర్భంగా ఈ రూమర్లకు చెక్ పెట్టేసింది సామ్.

ఇటీవల గుణశేఖర్ శాకుంతం మూవీలో నటించిన సామ్‌ తన తదుపరి చిత్రం డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌తో చేయబోతున్నట్లు ఇవాళ అధికారికంగా ప్రకటించింది. కొత్త డైరెక్టర్‌ శాంతరూబన్‌ జ్ఞానశేఖరన్‌ డైరెక్షన్‌లో తెరకెక్కబోయే ఈ చిత్రాన్ని ప్రొడక్షన్‌ నెం.30 అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఓ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్‌. ఇందులో సమంత డల్‌గా కనిపిస్తుండగా, ఓ విభిన్నమైన ప్రేమకథా చిత్రంగా ఈ మూవీ రూపొందనుందని ఫిలింనగర్ టాక్. ఎస్‌ఆర్‌ ప్రకాశ్‌ బాబు, ఎస్‌ఆర్‌ ప్రభులు సంయుక్తంగా నిర్మిస్తున్నఈ మూవీ ఏకకాలంలో తెలుగు, తమిళంలో తెరకెక్కనుంది. ఈ సినిమాలోని హీరోతో పాటు మిగిలిన నటీనటులు, సాంకేతిక వర్గం గురించి కూడా త్వరలోనే ప్రకటించి, వీలైనంత త్వరలోనే మూవీ సెట్స్‌పైకి తీసుకొచ్చేందుకు దర్శక-నిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నారని సమాచారం.

More News

మెగా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్: 35 రోజుల తర్వాత ఇంటికొచ్చిన సాయితేజ్.. డిశ్చార్జ్‌, బర్త్‌డే ఒకేసారి

పండగపూట మెగా అభిమానులకు గుడ్‌న్యూస్ అందింది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇన్ని రోజులు హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందిన హీరో సాయిధరమ్‌ తేజ్‌ శుక్రవారం

దసరాకు 'జీ 5'లో విడుదలైన 'రాజ రాజ చోర'కు హిట్ టాక్

'జీ 5'లో 'రాజ రాజ చోర' విడుదలైన వెంటనే సామాజిక మాధ్యమాల్లో హీరో శ్రీవిష్ణు, హీరోయిన్లు సునైనా, మేఘా ఆకాష్ నటనను ప్రశంసిస్తూ...

ప్రభాస్ 25లో హీరోయిన్‌గా కరీనా కపూర్..?

పాన్ ఇండియన్ స్టార్‌గా దూసుకెళ్తున్న ప్రభాస్ .. వరుసపెట్టి సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు. ఆయన ఓకే చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ భారీ బడ్జెట్ సినిమాలే..

బిగ్‌బాస్ 5 తెలుగు: యానీ మాస్టర్ తో ఫైట్.. పిల్లో చాటున ఏడ్చేసిన శ్వేతా, ప్రియా బూతులు

'బిగ్‌ బాస్' 5 తెలుగు రసవత్తరంగా సాగుతోంది. 'బీబీ బొమ్మల ఫ్యాక్టరీ' అనే కెప్టెన్సీ టాస్క్ సందర్భంగా ఇంటి సభ్యుల మధ్య గొడవ తారాస్థాయికి చేరింది.

ప్రెగ్నెన్సీని సీక్రెట్‌గా వుంచిన శ్రీయా..గర్వంగా వుందన్న మంచు లక్ష్మీ

డేటింగ్, పెళ్లి వంటి వాటిని రహస్యంగా వుంచి చిత్ర సీమకు షాకిచ్చిన శ్రీయా.. తల్లయిన విషయాన్ని కూడా అలాగే దాచిపెట్టింది.