close
Choose your channels

లైగర్‌లో సమంత ఐటెం సాంగ్.. సోషల్ మీడియాలో న్యూస్ వైరల్,  నిజమెంత..?

Monday, January 24, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంతా దూసుకెళ్తున్నారు. దేశ వ్యాప్తంగా ఈ ఇష్యూతో ఆమె మరింత పాపులర్ అయ్యారు. వరుసపెట్టి అవకాశాలతో చేజిక్కించుకుంటున్నారు. ఇక కెరీర్‌లోనే తొలిసారిగా ఆమె ‘‘పుష్ప’’లో చేసిన ఐటెం సాంగ్ ‘‘ఊ అంటావా.. ఊఊ అంటావా’’ దేశాన్ని ఊపేస్తోంది. దీంతో ఆమెకు మసాలా సాంగ్స్ చేయాల్సిందిగా ఆఫర్లు వస్తున్నట్లుగా ఫిలింనగర్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు పూరి జగన్నాధ్ రూపొందిస్తోన్న 'లైగర్' సినిమాలో స్పెషల్ సాంగ్ ను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇందు కోసం దర్శక నిర్మాతలు సమంతను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. విజయ్‌తో సమంతకు ఉన్న ఫ్రెండ్‌షిప్‌తో ఆమెని ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

అయితే దీనిపై అఫిషీయల్‌గా ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సమంత మరో ఐటెం సాంగ్ చేసే అవకాశం లేదని తెలుస్తోంది. వరుసపెట్టి మాస్ మసాలా సాంగ్స్ చేయడం తన కెరీర్‌పై ప్రభావం చూపుతుందని పలువురు అంటున్నారు. పైగా సామ్ చేతిలో నాలుగైదు సినిమాలున్నాయి. ముందు వాటిని పూర్తి చేయాల్సివుంది. ప్రధానంగా 'పుష్ప'లో ఐటెం సాంగ్ ఒప్పుకోవడానికి కారణం దర్శకుడు సుకుమార్ అనే చెప్పాలి. సమంతకి 'రంగస్థలం'లో మంచి పాత్ర ఇచ్చి కెరీర్‌కు ఎంతో సాయపడ్డారు. ఆ కృతజ్ఞతతోనే పుష్పలో ఐటెం సాంగ్‌లో నటించింది.

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే ‘‘య‌శోద’’ వంటి పాన్ ఇండియా సినిమాతో పాటు డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌లో సమంత ఓ సినిమా చేయాల్సి ఉంది. అలాగే జాన్ పిలిప్ ద‌ర్శ‌క‌త్వంలో అరెంజ్‌మెంట్ ఆఫ్ ల‌వ్ అనే ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీలోనూ సామ్ నటించనున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.