ఇక్కడ రాంచరణ్ తో.. అక్కడ రణవీర్ సింగ్ తో..

ఎక్కువగా బాలీవుడ్ చిత్రాలు చేస్తున్నప్పటికీ కియారా అద్వానీ టాలీవుడ్ లో కూడా మంచి అవకాశాలు అందుకుంటోంది. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్లకు టఫ్ కాంపిటీషన్ ఇస్తోంది. భరత్ అనే నేను చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కియారా యువతని తన గ్లామర్ తో మాయ చేసింది.

ఇదీ చదవండి: ప్రకృతి ఒడిలో లావణ్య త్రిపాఠి కేఫ్ నిర్మాణం. ఆమె ప్లాన్ ఏంటంటే!

ఇప్పుడు పలువురు స్టార్ హీరోల చిత్రాలకు ఆమెని హీరోయిన్ గా సంప్రదిస్తున్నారు. ఇక ఇండియా అగ్ర దర్శకులలో ఒకరైన శంకర్ ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. శంకర్ తెరకెక్కిస్తున్న ఇండియన్ 2 తీవ్రమైన వివాదాల్లో చిక్కుకుపోయింది. ఈ సినిమా పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు.

అయితే శంకర్ తదుపరి చిత్రం మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో ఉండబోతున్న సంగతి తెలిసిందే. అదే విధంగా బాలీవుడ్ లో అపరిచితుడు రీమేక్ కూడా చేయనున్నారు శంకర్. రణవీర్ సింగ్ తో ఈ ప్రాజెక్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.

తాజా జరుగుతున్న ప్రచారం మేరకు ఈ రెండు చిత్రాల్లో హీరోయిన్ గా శంకర్ కియారా అద్వానిని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారట. ఇప్పటికి ఇంకా ఏమీ ఫైనల్ కాలేదు కానీ.. కియారాతో చర్చలు మాత్రం ప్రారంభమైనట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే కియారా రెండవసారి రాంచరణ్ తో రొమాన్స్ కు రెడీ అవుతున్నట్లే. వీరిద్దరూ జంటగా వినయ విధేయ రామలో నటించారు.

More News

నేనేంటో చెప్పుకోవాల్సిన అవసరం లేదు.. నాగబాబుపై నరేష్ కామెంట్స్

'మా' ఎన్నికల్లో విమర్శలకు తావు లేదంటూనే ఒకరిపై ఒకరు పరోక్షంగా వ్యాఖ్యలు చేసుకుంటున్నారు.

ప్రకృతి ఒడిలో లావణ్య త్రిపాఠి కేఫ్ నిర్మాణం. ఆమె ప్లాన్ ఏంటంటే!

అందాల రాక్షసి ఫేమ్ లావణ్య త్రిపాఠి టాలీవుడ్ లో క్రేజ్ ఉన్న హీరోయిన్లలో ఒకరు.

ఓ డైరెక్టర్ నా క్లీవేజ్ చూడాలన్నాడు.. మరొకడు ఏకంగా..

బుల్లితెరపై నటిగా గుర్తింపు తెచ్చుకున్న సుర్వీన్ చావ్లా ఆ తర్వాత వెండితెరపై కూడా మెరిసింది.

ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ కు ప్రమాదం.. లారీని ఢీకొన్న కారు!

ప్రముఖ ఫిలిం క్రిటిక్, నటుడు కత్తి మహేష్ ప్రమాదానికి గురయ్యారు.

డైరెక్ట్ ఓటిటి రిలీజ్.. హాట్ స్టార్ తో నితిన్ ఫ్యాన్సీ డీల్ ?

యూత్ స్టార్ నితిన్ నుంచి ఈ ఏడాది ఇప్పటికే రెండు చిత్రాలు వచ్చాయి.