నాడు జగన్‌కు.. నేడు బాబుకు.. సేమ్‌ టూ సేమ్!

ప్రస్తుతం నెట్టింట్లో రెండు ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. అందులో ఒకటి ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిది కాగా.. మరొకటి టీడీపీ అధినేత చంద్రబాబుది. నవ్యాంధ్ర రాజధాని అమరావతిని తరిలించొద్దని రైతులు, టీడీపీ నేతలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల చంద్రబాబు తలపెట్టిన బస్సు యాత్రకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకోగా.. ఆయన పోలీసుల తీరును నిరసిస్తూ.. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ నేలపైనే కూర్చోని ధర్నాకు చేశారు. కాగా ఇందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అయ్యింది.

జగన్‌కు ఏం జరిగింది!?
కాగా.. గతంలో 2017 జనవరి-26న విశాఖలో క్యాండిల్ ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్తుండగా ఎయిర్‌పోర్టులో ప్రస్తుత సీఎం వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డి పోలీసులు అడ్డుకున్నారు. దీంతో జగన్ అక్కడే నేల మీద కూర్చుని నిరసన చేపట్టారు. నాడు జగన్‌కు జరిగిందే.. నేడు చంద్రబాబుకూ జరిగిందని వైసీపీ కార్యకర్తలు, జగన్ వీరాభిమానులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ.. ఇరువురూ ఇలా కూర్చొని ఉన్న ఫొటోలను వైరల్ చేస్తున్నారు. దీనికి టీడీపీ కార్యకర్తలు పెద్దఎత్తున కామెంట్ల వర్షం కురిపిస్తుండటంతో.. వైసీపీ వర్సెస్ తెలుగుదేశం కార్యకర్తలుగా నెట్టింట్లో పరిస్థితి నెలకొంది.

More News

'అల వైకుంఠపురములో' ఒక మంచి అనుభూతినిస్తుంది - త్రివిక్రమ్

'అల వైకుంఠపురములో' థియేటర్స్ నుంచి జనం ఒక కంప్లీట్ ఫీలింగ్తో, ఆనందంతో బయటకు వస్తా రని చెప్పారు త్రివిక్రమ్.

త్రివిక్రమ్ సినిమాల్లో ‘స్త్రీలు, ఇళ్లు’ పైనే ఫోకస్ ఎందుకు!?

‘అల వైకుంఠపురములో’ థియేటర్స్ నుంచి జనం ఒక కంప్లీట్ ఫీలింగ్‌తో, ఆనందంతో బయటకు వస్తారని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చెప్పుకొచ్చారు.

మహేశ్‌తో మళ్లీ మళ్లీ వర్క్ చేయాలని ఉంది: దేవి శ్రీ ప్రసాద్

టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరికీ మ్యూజికల్ హిట్స్‌ను అందించి అందరి అభిమానుల మన్ననలు పొందుతూ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సంగీత దర్శకుడిగా

మహేష్ గారు ఆ పాట విన్నప్పుడు పడి పడి నవ్వారు - దేవిశ్రీ ప్రసాద్

టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరికీ మ్యూజికల్ హిట్స్ ను అందించి అందరి అభిమానుల మన్ననలు పొందుతూ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సంగీత దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు

సీఎం జగన్ కేసులో తెలంగాణ మంత్రికి నోటీసులు!!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు ఇప్పటికీ ఇంకా తేలలేదు. ఇదివరకే పలుమార్లు సీబీఐ కోర్టు విచారించినప్పటికీ ఇంతవరకూ తేల్చలేదు.