పాప‌కు జ‌న్మ‌నిచ్చిన స‌మీరారెడ్డి

  • IndiaGlitz, [Saturday,July 13 2019]

మాజీ హీరోయిన్ స‌మీరారెడ్డి శుక్ర‌వారం ఉద‌యం పాప‌కు జ‌న్మ‌నిచ్చారు. తెలుగులో జైచిరంజీవ, అశోక్‌, న‌ర‌సింహుడు చిత్రాల్లో హీరోయిన్‌గా న‌టించిన స‌మీరారెడ్డి, ప‌లు బాలీవుడ్ సినిమా్ల్లోనూ న‌టించారు. 2014లో అక్ష‌య్ వ‌ర్దే అనే బిజినెస్‌మేన్‌ను పెళ్లి చేసుకున్నారు. ఈ దంప‌తుల‌కు 2015లో హ‌న్స్ వ‌ర్దే అనే బాబు పుట్టాడు. కాగా.. ఇప్పుడు ఓ పాప పుట్టింది. ఈ విష‌యాన్ని స‌మీరారెడ్డి త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తెలియ‌జేసింది. 'చిన్నారి దేవ‌త పాప రూపంలో మా ఇంట్లోకి అడుగుపెట్టింది. మీ అశీర్వాదాలు అందించినందుకు కృత‌జ్ఞ‌త‌లు' అన్నారు స‌మీరారెడ్డి. ఈ మెసేజ్‌తో పాటు చిన్నారి పాప త‌న చేయిని ప‌ట్టుకున్న ఫొటోను కూడా షేర్ చేశారు. నెటిజ‌న్స్ స‌మీరాకు అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నారు.