'స‌మ్మోహ‌నం' షూటింగ్ పూర్తి

  • IndiaGlitz, [Tuesday,April 24 2018]

కొత్త అనే ప‌దాన్ని రోజూ విన్నా కొత్త‌గానే ఉంటుంది.  ప్రేమ అనే ప‌దం కూడా అలాంటిదే. త‌ర‌త‌రాలుగా, యుగ‌యుగాలుగా మాన‌వాళికి ప్రేమ‌తో ప‌రిచ‌యం ఉంది. అలాంటి అపురూప‌మైన‌, అనూహ్య‌మైన సంఘ‌ట‌న‌ల‌తో కొత్త త‌రం ప్రేమ క‌థ‌తో రూపొందుతోన్న చిత్రం 'స‌మ్మోహ‌నం'. షూటింగ్ పూర్త‌యింది.

సుధీర్‌బాబు హీరోగా మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో  శ్రీదేవి మూవీస్ ప‌తాకంపై శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ నిర్మిస్తున్న చిత్రం 'స‌మ్మోహ‌నం'.  బాలీవుడ్ భామ అదితీరావు హైదరీ ఇందులో నాయిక‌గా న‌టించారు.  శ్రీదేవి మూవీస్ ప్రొడ‌క్ష‌న్ నెంబ‌ర్ 10గా తెర‌కెక్కిన 'స‌మ్మోహ‌నం' జూన్ 15న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

నిర్మాత శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ మాట్లాడుతూ మా 'స‌మ్మోహ‌నం' షూటింగ్ ని సుముహూర్తంలో ప్రారంభించాం. నిరాటంకంగా, నిర్విఘ్నంగా , శ‌ర‌వేగంగా, అంతే నాణ్య‌త‌గా చిత్రీక‌ర‌ణ పూర్తిచేశాం. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు మొద‌లుపెట్టాం.

త్వరలో టీజ‌ర్‌ను విడుద‌ల చేస్తాం. జూన్ 15న చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తాం. పాట‌లు  శ్రోత‌ల‌ను మెప్పిస్తాయి. అత్యుత్త‌మ సాంకేతిక విలువ‌ల‌తో తెర‌కెక్కించిన చిత్రం త‌ప్ప‌క ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంద‌నే న‌మ్మ‌కం ఉంది అని చెప్పారు.

ద‌ర్శ‌కుడు  మోహనకృష్ణ ఇంద్రగంటి   మాట్లాడుతూ మంచి క‌థ‌, క‌థ‌నానికి చ‌క్క‌టి నిద‌ర్శ‌నం ఈ చిత్రం. రొమాన్స్, హాస్యం స‌మ్మిళిత‌మైన 'స‌మ్మోహ‌నం' షూటింగ్ పూర్తి చేసుకుంది. చిల్డ్ర‌న్స్ బుక్స్ ఇల్ల‌స్ట్రేట‌ర్‌గా హీరో క‌నిపిస్తారు. అనూహ్య‌మైన క‌థాంశంతో, ఆద్యంతం వినోదాత్మ‌కంగా న‌డిచే క‌థ‌తో చిత్రాన్ని తెర‌కెక్కించాం. నిర్మాణ విలువ‌లు మెప్పిస్తాయి.

వివేక్ సాగ‌ర్ అందించిన సంగీతం వీనుల విందుగా ఉంటుంది. పి.జి.విందా ఫొటోగ్ర‌ఫీ చిత్రానికి హైలైట్ అవుతుంది. జూన్‌లో తొల‌క‌రి జ‌ల్లులు ప‌డే వేళ మా సినిమా కూడా ప్రేక్ష‌కుల మ‌న‌స్సుల‌ను రంజింప‌జేయ‌డానికి సిద్ధ‌మ‌వుతోంది అని చెప్పారు.

న‌టీన‌టులు:

సుధీర్‌బాబు, అదితిరావు హైద‌రి, డా. వి. కె. న‌రేశ్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, పవిత్ర లోకేష్ , నందు, కేదార్ శంక‌ర్‌, కాదంబ‌రి కిర‌ణ్‌, హ‌రితేజ‌, రాహుల్ రామ‌కృష్ణ‌, శిశిర్‌శ‌ర్మ,అభయ్ ,హర్షిణి  త‌దిత‌రులు.

సాంకేతిక నిపుణులు:

ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్స్:  పి. ర‌షీద్ అహ్మ‌ద్ ఖాన్‌, కె. రామాంజ‌నేయులు, కో డైర‌క్ట‌ర్‌:  కోట సురేశ్ కుమార్‌, ఫైట్స్ :రామకృష్ణ , ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: య‌స్ . ర‌వీంద‌ర్‌, ఎడిట‌ర్‌:  మార్తాండ్‌.కె.వెంక‌టేశ్‌;  డైర‌క్ట‌ర్ ఆఫ్ పొటోగ్ర‌ఫీ:  పి.జి.విందా,  సంగీతం:  వివేక్ సాగ‌ర్‌, సాహిత్యం : సిరివెన్నెల సీతారామ శాస్త్రి , రామజోగయ్య శాస్త్రి ,నిర్మాత‌:  శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్‌,  ర‌చ‌న‌- ద‌ర్శ‌క‌త్వం:  మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి.

More News

మ‌హేష్‌.. ఐదేళ్ళ త‌రువాత

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఒకే ఏడాదిలో రెండేసి సినిమాల‌తో సంద‌డి చేసిన సంద‌ర్భాలు త‌క్కువ‌నే చెప్పాలి.

బాల‌య్య సినిమాకు పోటీగా..

నంద‌మూరి బాల‌కృష్ణకు క‌లిసొచ్చిన ద‌ర్శ‌కుల‌లో బోయ‌పాటి శ్రీ‌నుకి ప్ర‌త్యేక స్థాన‌ముంది. బాల‌య్య‌కు వరుస ప‌రాజ‌యాలు ఉన్న స‌మ‌యంలో.. సింహా, లెజెండ్ వంటి సినిమాల‌ను అందించి..

ఆ ఇద్ద‌రు మిస్స‌యినా.. కొర‌టాల మిస్ కాలేదు

ఇటీవ‌ల కాలంలో తొలి చిత్రంతో విజ‌యం సాధించిన ప‌లువురు తెలుగు ద‌ర్శ‌కులు..

సుమా రంగనాథన్ ప్రధాన పాత్రలో 'దండుపాళ్యం 4'

ఒకప్పుడు బోల్డ్ బ్యూటీగా పేరొందిన సుమా రంగనాథన్ (సుమన్ రంగనాథన్) ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రలకు న్యాయం చేస్తూనే ఉన్నారు.

దేవిశ్రీ ఖాతాలో మ‌రొక‌రు..

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో నంబ‌ర్ వ‌న్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా రాణిస్తున్నారు యువ సంగీత సంచ‌ల‌నం దేవిశ్రీ ప్ర‌సాద్‌.