చిత్ర సీమలో విషాదం.. అనారోగ్యంతో కేజీఎఫ్ 2 స్టార్ మోహన్ జునేజా కన్నుమూత

  • IndiaGlitz, [Saturday,May 07 2022]

కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు మోహన్ జునేజా మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. కర్ణాటక రాష్ట్రం తుమకూరు జిల్లాలో జన్మించిన మోహన్.. తొలుత సీరియల్స్ ద్వారా తన ప్రతిభను చాటుకున్నారు. అనంతరం సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చి.. అతి తక్కువ సమయంలోనే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. చెల్లాట సినిమా ఈయనకు బ్రేక్ ఇచ్చింది. అంతేకాదు ఆ తర్వాత మళ్లీ వెనుదిరిగి చూసుకుని అవకాశం రాలేదు.

ఆపై వరుసగా మ‌స్తీ, రామ్‌లీలా, బ‌చ్చ‌న్‌, కేజీఎఫ్ లాంటి సినిమాలలో నటించారు మోహన్. కేజీఎఫ్ చిత్రంతో ఈయ‌న‌కు కర్ణాటకతో పాటు జాతీయ స్థాయిలో గుర్తింపు వ‌చ్చింది. గ్యాంగ్‌తో వ‌చ్చే వాడు గ్యాంగ్‌స్టర్‌.. కానీ అత‌నొక్క‌డే వ‌స్తాడు మాన్‌స్ట‌ర్... అంటూ మోహన్ జునేజా చెప్పిన డైలాగ్ బాగా పాపులర్ అయ్యింది. ఆయన మరణం పట్ల కన్నడతో పాటు ఇతర సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖులు సంతాపం తెలియజేశారు. కేజీఎఫ్ తెచ్చిన గుర్తింపుతో మోహన్ మరింత బిజీ అవుతారని భావిస్తున్న తరుణంలో ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే కేజీఎఫ్‌కు సీక్వెల్‌గా తెరకెక్కిన కేజీఎఫ్ 2 వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది. విడుదలై దాదాపు నెల రోజులు కావొస్తున్నా ఈ సినిమా హవా తగ్గడం లేదు. ఇప్పటికే 1000 కోట్ల మార్క్‌ను దాటేసింది. తాజాగా బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్‌ఖాన్ నటించిన దంగల్‌ రికార్డులను కేజీఎఫ్ 2 బ్రేక్ చేసింది. ఇప్పటి వరకు హిందీలో 511.3 కోట్లను సాధించి 'బాహుబలి 2' మొదటి స్థానంలో ఉంటే, 387.4 కోట్ల వసూళ్లతో 'దంగల్' రెండో స్థానంలో నిలిచింది. ఇప్పుడు ఈ రికార్డును 'కేజీఎఫ్ 2' బద్ధలు కొట్టింది. రెండు రోజుల క్రితం 391.65 కోట్లను రాబట్టిన 'కేజీఎఫ్ 2' .. 'దంగల్' స్థానాన్ని ఆక్రమించింది. ఇప్పుడు దాని చూపు బాహుబలి 2పై పడింది.

More News

కొంతకాలం చూద్దాం... ఆన్‌లైన్‌లో టికెట్ విక్రయాలకు ఏపీ హైకోర్టు ఓకే

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ ధరల తగ్గింపు, టికెట్ల ఆన్‌లైన్ విక్రయం, బెనిఫిట్ షోల రద్దు వంటి ప్రభుత్వ నిర్ణయాలు వివాదాస్పదనమైన సంగతి తెలిసిందే.

ప్రతి ఒక్కరి హార్ట్ కు టచ్ అయ్యే సినిమా “శేఖర్”.. దర్శకురాలు జీవితా రాజశేఖర్

రాజశేఖర్ గారి అక్క మొగుడు, సింహరాశి, గోరింటాకు, సినిమాలు ప్రేక్షకులను ఏవిధంగా అలరించాయో ఇప్పుడు వస్తున్న "శేఖర్ "

‘ఆటా’ 17వ మహాసభలు.. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఆహ్వానం

అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో జూలై 1 నుంచి 3 వరకు జరిగే 17వ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (ఆటా) మహాసభలకు

లైవ్‌లోనే విశ్వక్‌సేన్‌ను చెప్పుతో కొట్టాల్సింది .. సినిమాల్లోకి రానీయొద్దు : దానం నాగేందర్ వ్యాఖ్యలు

హీరో విశ్వక్‌సేన్ నటించిన ‘‘అశోకవనంలో అర్జున కళ్యాణం’’ చిత్రం మే 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇంజినీరింగ్ కాలేజీలో 'అల్లంత దూరాన' పాట విడుదల

"అల్లంత దూరాన" చిత్రంలో హుషారుగా సాగే  ఓ యూత్ ఫుల్ పాటను హైదరాబాద్ లోని ఎం.వి.ఎస్.ఆర్. ఇంజినీరింగ్ కాలేజీ లో