ఐదేళ్ల త‌ర్వాత అదే డైరెక్ట‌ర్‌తో సందీప్‌....

  • IndiaGlitz, [Friday,July 17 2020]

ప్ర‌స్థానం సినిమాతో న‌టుడిగా కెరీర్‌ను స్టార్ట్ చేసిన సందీప్ కిష‌న్ అటు త‌మిళం, ఇటు తెలుగులోనూ సినిమాలు చేస్తూ త‌న‌దైన గుర్తింపును సంపాదించుకున్నారు సందీప్‌. క్ర‌మంగా హీరోగానే కాదు.. నిర్మాత‌గానూ మారి నిను వీడ‌ని నీడ‌ను నేనే సినిమాను నిర్మించారు. హీరోగా న‌టిస్తూ, సందీప్ నిర్మించిన తొలి చిత్రం నిను వీడ‌ని నీడ‌ను నేనే మంచి విజ‌యాన్ని సాధించింది. ఇప్పుడు సందీప్ కిష‌న్ మ‌రో సినిమా నిర్మాణంలో సందీప్ బిజీగా ఉన్నారు. ఆ సినిమానే ఏ1 ఎక్స్‌ప్రెస్‌. దీని త‌ర్వాత సందీప్ ఎవ‌రితో సినిమా చేస్తాడ‌నే దానిపై క్లారిటీ రాలేదు.

లేటెస్ట్ సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు సందీప్ కిష‌న్ డైరెక్ట‌ర్ వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌బోతున్నార‌ని టాక్‌. ఇప్ప‌టికే చ‌ర్చ‌లు పూర్త‌యాయ‌ని అంటున్నారు. త్వ‌ర‌లోనే అధికారిక స‌మాచారం రానుంద‌ట‌. ఇక్క‌డ ప్ర‌స్తావించాల్సిన విష‌య‌మేమంటే ఇంత‌కు ముందు సందీప్‌కిష‌న్‌, వి.ఐ.ఆనంద్ కాంబినేష‌న్‌లో టైగ‌ర్ సినిమా విడుద‌లైంది. ఈ సినిమాలో సందీప్‌ను స‌రికొత్త యాంగిల్‌లో ప్రెజంట్ చేసిన ఆనంద్‌, ఈ సారి మ‌రో కొత్త కోణంలో ఆవిష్క‌రించ‌బోతున్నాడ‌ని టాక్. యాక్ష‌న్ కాన్సెప్ట్‌తో పాటు సూప‌ర్ నేచుర‌ల్ అంశాల‌ను క‌ల‌గలిపి క‌థ‌ను సిద్ధం చేశాడ‌ని అంటున్నాయి సినీ వ‌ర్గాలు.

More News

ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్

నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయమై ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈడీ కేసులో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌కు ఊరట

ఈడీ కేసులో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌కు హైకోర్టులో ఊరట లభించింది.

ఏపీలో రికార్డ్ స్థాయిలో కేసులు.. నేడు ఎన్నంటే..

ఏపీలో కరోనా రోజురోజుకూ విజృంభిస్తోంది. శుక్రవారం కరోనా బులిటెన్‌ను ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది.

సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి చుక్కెదురు..

సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి చుక్కెదురైంది. తెలంగాణ సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

చార్మి ఇంట విషాదం.. నిన్ననే చివరి వీడియో కాల్ అంటూ భావోద్వేగం

టాలీవుడ్ హీరోయిన్, నిర్మాత చార్మి ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆమెకు చాలా ఆప్తురాలైన అత్త మృతి చెందారు.