ఏప్రిల్ 30న యువి కాన్సెప్ట్స్ నిర్మాణంలో రూపొందుతున్న 'ఏక్ మినీ కథ' చిత్రం విడుదల.. 

  • IndiaGlitz, [Saturday,April 17 2021]

కొత్త దర్శకులకు అవకాశం ఇస్తూ.. వరుస విజయాలు అందుకుంటున్న నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్. దీనికి అనుబంధ సంస్థగా యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ మొదలు పెట్టారు. ఈ బ్యాన‌ర్ లో నిర్మాణం పూర్తి చేసుకున్న ఏక్ మినీ కథ చిత్ర ఫస్ట్ లుక్ ఈ మధ్యే విడుదలైంది. Does Size Matter అంటూ పోస్టర్ లో ఉన్న మ్యాటర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. పేపర్ బాయ్ సినిమాతో నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న సంతోష్ శోభన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఈయన లుక్ కు అద్భుతమైన స్పందన వస్తుంది. ఈ మధ్యే విడుదలైన ఈ మాయలో.. లిరికల్ సాంగ్ విడుదలైంది. దీనికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ఈ చిత్ర విడుదల తేదీ ఖరారైంది. ఎప్రిల్ 30న ఏక్ మిని కథ సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు దర్శక నిర్మాతలు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా లాంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాంధీ కథ అందించారు. కార్తీక్ రాపోలు ఏక్ మినీ కథ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రవీందర్ ప్రొడక్షన్ డిజైనర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గోకుల్ భారతి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ప్రవీణ్ లక్కరాజు సంగీతం సమకూరుస్తున్నారు. సత్య ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్రయూనిట్.

నటీనటులు: సంతోష్ శోభన్, కావ్య తప్పర్, బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు..

More News

విజయ్ ఆంటోని ‘విజయ రాఘవన్’ మే 14న రిలీజ్‌

న‌కిలీ, డా.సలీమ్‌, బిచ్చగాడు, భేతాళుడు, ఇంద్రసేన, రోషగాడు, కిల్లర్‌ వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్న హీరో విజయ్‌ ఆంటోని.

ఇండియన్ స్క్రీన్ పై సరికొత్త ప్రయోగానికి శ్రీకారం

ఇండియన్ సినిమా చరిత్రలోనే సరికొత్త ప్రయోగానికి టాలీవుడ్ శ్రీకారం చుట్టబోతోంది. సింగిల్ షాట్..

చేతులు జోడించి క్షమాపణలు చెప్పిన తనికెళ్ల భరణి

నటుడిగానూ.. అంతకు మించి రచయితగానూ తెలుగు ప్రేక్షకులకు తనికెళ్ల భరణి సుపరిచితులు. సినిమాలో ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఆయన జీవించేస్తారు.

కమెడియన్ వివేక్ కన్నుమూత

కోలీవుడ్‌కి చెందిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్ వివేక్(59) గుండెపోటుతో శ‌నివారం ఉద‌యం ఐదు గంట‌ల‌కు క‌న్నుమూశారు.

పవన్ కల్యాణ్‌కు కరోనా పాజిటివ్

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ఆ పార్టీ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది.