సందీప్ తో సరదా గర్ల్

  • IndiaGlitz, [Sunday,November 01 2015]

జాదూగాడు సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన ఉత్త‌రాది భామ సోనారిక. ప్ర‌స్తుతం మంచు విష్ణు న‌టిస్తున్న స‌ర‌దాలోనూ న‌టిస్తోంది. ఇప్పుడు ఆమె తాజాగా ఓ సినిమాకు సంత‌కం చేసింది. ఆ సినిమాలో సందీప్ కిష‌న్ హీరోగా న‌టిస్తున్నారు. ఈ సినిమాకు రాజ‌సింహ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఒక్క అమ్మాయి త‌ప్ప అనేది ఆ సినిమా. ఆల్ ఇండియ‌న్స్ ఆర్ బ్ర‌ద‌ర్స్ అండ్ సిస్ట‌ర్స్ అనే ఉప‌శీర్షిక‌తో రాజ‌సింహ ద‌ర్శ‌క‌త్వంలో ఇటీవ‌ల ఈ సినిమా మొద‌లైంది. ఇటీవ‌లే షూటింగ్ కూడా మొద‌లైంది. ఈ సినిమాకు చోటా.కె.నాయుడు ఛాయాగ్ర‌హాన్ని అందిస్తున్నారు. మిక్కీ స్వ‌రాల‌ను స‌మ‌కూరుస్తున్నారు. ఫ‌క్తు ఎంట‌ర్ టైనింగ్ గా సాగే సినిమా అవుతుంద‌ని చిత్ర యూనిట్ చెబుతున్నారు.

More News

'అబ్బాయితో అమ్మాయి' లవ్ స్టోరీ హార్ట్ టచింగ్ గా ఉంటుంది

నేటి యువతకు రెండు ప్రపంచాలు ఉంటున్నాయి.ఒకటి రియల్ వరల్డ్...మరొకటి వర్చువల్ వరల్డ్.వర్చువల్ వరల్డ్... అంటే...సోషల్ మీడియాలో మాత్రం తమ మనసుని,అభిప్రాయాలను,భావాలను సంపూర్ణంగా,స్వేచ్ఛగా ఆవిష్కరించుకుంటున్నారు.

సమంత సినిమాలు క్యూ కడుతున్నాయ్

డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు తమిళ,తెలుగు భాషల్లో నెలకో సినిమాతో సందడి చేసేందుకు సమంత సిద్ధమౌతోంది.

'కుమారి 21 ఎఫ్ ' కూడా అలాగే..

''ప్రేమించడానికి నేను సరిపోనా..నా బ్యాక్ గ్రౌండ్ కూడా కావాలా''అంటూ ''కుమారి 21ఎఫ్''లో సందడి చేయనుంది హెబ్బా పటేల్.

లక్కీ గర్ల్ బిందు మాధవి

తెలుగులో అంత లక్కీ అనిపించుకోకపోయినా..తమిళంలో మాత్రం లక్కీ గర్ల్ గానే పేరు తెచ్చుకుంటోంది బిందు మాధవి.విజయాల విషయంలోనే కాదు..

లోఫర్ కి గుమ్మడికాయ

లోఫర్ సినిమాకు గుమ్మడికాయను కొట్టేశారు.వరుణ్ తేజ్పై ఆఖరి షాట్ ను తీసి గుమ్మడికాయ కొట్టేశారు.ఈ సినిమాలో పెద్ద దొంగగా కనిపిస్తాడు వరుణ్ తేజ్.