సుశాంత్ ఫామ్‌ హౌస్ పార్టీలకు సారా.. రియా వచ్చేవారు: రాయిస్

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు అనేక మలుపులు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణ నిర్వహిస్తున్న కొద్దీ ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసును చేతుల్లోకి తీసుకున్న సీబీఐ.. డ్రగ్స్ కోణం బయటపడటంతో దీనికి సంబంధించిన విచారణను ఎన్‌సీబీకి అప్పగించిన విషయం తెలిసిందే. డ్రగ్స్ కోణానికి సంబంధించి ఇప్పటికే ఎన్‌సీబీ రియాతో పాటు ఆమె సోదరుడు షోవిక్‌ను విచారించింది. అలాగే డ్రగ్ మాఫియాకు సంబంధించిన పలువురు వ్యక్తులను సైతం అదుపులోకి తీసుకుని విచారిస్తోంది.

అయితే ఈ కేసులో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌‌కి చెందిన లోనావాలా ఫామ్‌హౌస్ కూడా కీలకంగా మారింది. డ్రగ్స్ పార్టీలన్నింటికీ ఇదే కేంద్రంగా మారిందని తెలియడంతో అధికారులు దీనిపై కూడా దృష్టి సారించారు. అయితే తాజాగా లోనావాలా ఫామ్‌హౌస్ మేనేజర్ రాయిస్.. ఓ ఇంటర్వ్యూలో సుశాంత్‌కు సంబంధించిన పలు విషయాలను వెల్లడించారు. తాను లోనావాలా ఫామ్‌‌హౌస్ మేనేజర్‌గా 2018 నుంచి విధులు నిర్వర్తిస్తున్నానని రాయిస్ తెలిపారు. ఫ్రెండ్స్‌తో కలిసి సుశాంత్ తరచూ అక్కడికి వచ్చేవాడని.. తాను మేనేజర్‌గా చేరిన కొత్తలో సుశాంత్‌తో కలిసి నటి సారా అలీఖాన్ కూడా లోనావాలాకు వచ్చి పార్టీలు చేసుకునే వారని వెల్లడించారు.

ఆ తర్వాత కొంతకాలానికి రియా కూడా వచ్చేదన్నారు. లాక్‌డౌన్‌కు ముందు వారానికి ఒకటి, రెండు సార్లు సుశాంత్ తన స్నేహితులతో కలిసి అక్కడకు వచ్చి పార్టీలు చేసుకునే వాడని తెలిపారు. పార్టీల కోసం స్మోకింగ్ పేపర్ ఆర్డర్ చేసేవాడని.. అయితే అదెందుకో తనకు తెలియదన్నారు. లోనావాలాలో జరిగే పార్టీలకు అత్యంత ఖరీదైన వోడ్కాను అతిథులకు అందించడం జరిగేదని తెలిపారు. గతేడాది రియా బర్త్‌డేను కూడా ఆమె తల్లిదండ్రులు, సోదరుడు లోనావాలోనే నిర్వహించారని రాయిస్ వెల్లడించారు.

More News

ఆర్జీవీ బయోపిక్ పార్ట్ 1 షూటింగ్ స్టార్ట్

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మూడు భాగాల బయోపిక్ లో తొలి భాగం షూటింగ్ బుధవారం హైదరాబాద్ లో ప్రారంభమైంది.

బెజవాడ కనకదుర్గమ్మ రథంలోని 3 వెండి సింహాలు మాయం

ఏపీ దేవాలయాల్లో చోటు చేసుకుంటున్న వరుస ఘటన ఆందోళన కలిగిస్తున్నాయి. అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి రథం అగ్నికి ఆహుతైపోయిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

బిగ్‌బాస్ హౌస్‌లో బిర్యానీని చూడనట్లు బిహేవ్ చేస్తారు: సూర్యకిరణ్

బిగ్‌బాస్ సీజన్ 4 నుంచి ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన సూర్యకిరణ్ ఓ ఇంటర్వ్యూలో హౌస్ గురించి పలు ఇంట్రస్టింగ్ విషయాలను వెల్లడించారు.

శ‌ర్వానంద్‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోయిన్‌...?

డైరెక్ట‌ర్‌గా తొలి చిత్రం ‘ఆర్‌.ఎక్స్ 100’తో సూప‌ర్‌హిట్ అందుకున్నాడు అజ‌య్ భూప‌తి. త‌ర్వాత ‘మ‌హా స‌ముద్రం’ అనే మ‌ల్టీస్టార‌ర్ క‌థ‌ను సిద్ధం చేసుకున్నాడు. ర‌వితేజ‌, సిద్ధార్థ్ స‌హా

తండ్రి త‌ర్వాత కొడుకుతో ప‌నిచేయ‌నున్న మెగాస్టార్‌!

మెగాస్టార్ చిరంజీవి స్పీడుపెంచాడు. ప్ర‌స్తుతం `ఆచార్య` సినిమాను ఆయ‌న పూర్తి చేయాల్సి ఉంది. దీని త‌ర్వాత మ‌రో నాలుగైదు క‌థ‌ల‌తో ద‌ర్శ‌కులు సిద్ధంగా ఉన్నారు.