'భీష్మ' 'సరాసరి' గీతం విడుదల

  • IndiaGlitz, [Monday,February 10 2020]

నితిన్,రష్మిక మందన,వెంకీ కుడుముల కాంబినేషన్ లో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై యువ నిర్మాత సూర్యదేవర నాగ వంశి నిర్మిస్తున్న చిత్రం 'భీష్మ'. ఈ చిత్రంలోని మరో గీతం ఈరోజు అధికారికంగా సామాజిక మాధ్యమం అయిన 'యు ట్యూబ్' ద్వారా విడుదల అయింది. హీరో నితిన్, నాయిక రష్మిక మందన బృందంపై చిత్రీకరించిన ఈ గీతానికి శేఖర్ మాస్టర్ నృత్య రీతులు సమకూర్చారు. రాజమండ్రి పరిసర ప్రాంతాలలో ఈ పాట చిత్రీకరణ జరిగింది. గీత రచయిత శ్రీమణి సాహిత్యానికి, సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్ స్వరాలు సమకూర్చగా, గాయకుడు అనురాగ్ కులకర్ణి గాత్రంలో ప్రాణం పోసుకుందీ పాట. 'సరాసరి' పేరుతో విడుదలయిన ఈ గీతానికి సంగీత ప్రియులనుంచి, అభిమానులనుంచి విశేష స్పందన లభించింది. నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్న ఈ చిత్రం ఫిబ్రవరి 21 న విడుదల కానుంది.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ ... ఈ చిత్రం లోని మరో గీతం ఈరోజు విడుదల అయింది. 'సరాసరి' పేరుతో విడుదల అయిన ఈ గీతానికి ప్రేక్షకాభిమానులనుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఈ గీతానికి శేఖర్ మాస్టర్ సమకూర్చిన నృత్య రీతులు అభిమానులను అలరిస్తాయి. ఈ చిత్రం నుంచి విడుదల అవుతున్న ప్రతి గీతానికి ప్రేక్షకాభిమానులనుంచే కాక, సామాజిక మాధ్యమాలలో సైతం విశేషమైన ప్రాచుర్యం లభిస్తోంది. 'భీష్మ' చిత్ర కధ,కధనాలు,సన్నివేశాలు,సంభాషణలు చాలా కొత్తగా ఉంటాయి. 'భీష్మ' ఒక రొమాంటిక్ ఎంటర్ టైనర్.. వినోద ప్రధానంగా సాగుతుంది అని తెలిపారు దర్శకుడు వెంకీ కుడుముల

నటీ,నటులు: నితిన్,రష్మిక మండన,నరేష్,సంపత్,రఘుబాబు,బ్రహ్మాజీ,నర్రా శ్రీనివాస్,వెన్నెల కిషోర్,అనంత నాగ్,శుభలేఖ సుధాకర్,జస్సెన్ గుప్త, సత్యన్, మైమ్ గోపి, సత్య, కల్యాణి నటరాజన్,రాజశ్రీ నాయర్,ప్రవీణ తదితరులు నటిస్తున్నారు.

More News

'జాను' థాంక్స్ మీట్

శర్వానంద్‌, సమంత అక్కినేని హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం `జాను`. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై సి.ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వంలో

ఆస్కార్ విజేత‌లు వీరే

లాస్ ఏంజిల్స్‌లో 92వ అకాడ‌మీ అవార్డుల వేదిక ఘ‌నంగా జరుగుతోంది. హాలీవుడ్‌లో ఆస్కార్ అవార్డుల‌కు ఉన్న ప్రాధాన్య‌త గురించి ప్రత్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.

సైబర్ పోలీసులకు యాంకర్ అనసూయ ఫిర్యాదు

జబర్‌ద‌స్త్ ప్రోగ్రామ్ ద్వారా యాంక‌ర్‌గా పాపుల‌ర్ అయిన అన‌సూయ త‌ర్వాత టీవీ షోస్‌తో ఫుల్ బిజీగా మారింది.

‘ఒరేయ్‌ బుజ్జిగా...’ ఫస్ట్ లుక్ విడుదల

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ కథానాయకుడిగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై

ఆర్జీవీ తాతయ్య అయ్యాడోచ్..!?

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాతయ్య అయ్యాడు. ఇవాళ ఉదయం 7:30 గంటలకు ఆయన కుమార్తె రేవతి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆయన సన్నిహితులు, కుటుంబీకులు సోషల్ మీడియా వేదికగా