‘సూర్యుడివో చంద్రుడివో..’ సాంగ్: రాక్‌స్టార్ రాక్స్.. ప్రాక్ ఫసక్!

  • IndiaGlitz, [Monday,December 09 2019]

సూపర్‌స్టార్‌ మహేష్‌, రష్మిక మందన్నా నటీనటులుగా టాలెంటెడ్ డైరెక్టర్ అనీల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి నటిస్తున్నారు. సినిమా రిలీజ్‌లకు రోజులు దగ్గరపడుతుండటంతో ప్రతి సోమవారం ఒక్క సాంగ్ అంటూ చిత్రబృందం రిలీజ్ చేస్తోంది. రీసెంట్‌గానే ఈ చిత్రం నుండి విడుదలైన ఫ‌స్ట్ సాంగ్‌ ‘మైండ్ బ్లాక్‌’కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ పాటకి వచ్చిన పాపులారిటీ దృష్ట్యా మేకర్స్ స్పెషల్ కాంటెస్ట్‌లు కూడా అనౌన్స్ చేశారు. చార్ట్ బస్టర్‌గా నిలిచిన ఫస్ట్ సాంగ్ తర్వాత ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం నుండి సెకండ్ సింగిల్ ‘సూర్యుడివో చంద్రుడివో...’ సోల్ ఫుల్ మెలోడీని డిసెంబర్ 9 (సోమవారం) సాయంత్రం 5:04 నిమిషాలకు విడుదల చేస్తామని ప్రకటించిన సంగతలి తెలిసిందే.

సింగిల్‌ సాంగ్‌తో సూపర్‌స్టార్ ఫ్యాన్స్‌ నచ్చేశాడు!

అయితే అనుకున్నట్లుగానే సరిగ్గా 5:04 గంటలకు ‘సూర్యుడివో చంద్రుడివో...’ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాట వినసొంపైన ఫ్యామిలీ మెలోడీ‌గా చక్కగా ఉందని కామెంట్స్ వస్తున్నాయ్. మరోవైపు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఎంతగానో ఆకట్టుకునే ఒక సోల్ ఫుల్ మెలోడీని అందించారని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ పాటను ప్రముఖ పంజాబీ సింగ్ బి ప్రాక్ ఆలపించడం విశేషమని చెప్పుకోవచ్చు. కాగా ఆయన తెలుగులో పాట పాడటం ఇదే తొలిసారి. తెలుగులోనే కాదు సౌత్ ఇండియాలో ఆయన పాడటం కూడా ఇదే మొదటిసారి. తన తొలి తెలుగు పాటతోనే ప్రాక్ ఆకట్టుకున్నారు.. మహేశ్ వీరాభిమానుల్లో స్థానం సంపాదించుకున్నారు. కాగా.. రామజోగయ్య శాస్త్రి ఎప్పటిలానే మంచి సాహిత్యం అందించారని ప్రశంసిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సాంగ్‌ను బట్టి చూస్తే రాక్ స్టార్ రాక్స్.. ప్రాక్ ఫసక్ అంతే!

More News

రజినీకాంత్‌ తో మహానటి

తలైవా, సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ 168వ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

రోజా వ్యాఖ్యలపై పవన్ రియాక్ట్ అవుతాడా!?

ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడిన వారికి చెమ్డాలు ఊడేలా రెండు బెత్తం దెబ్బలు కొట్టాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

కష్టమొస్తే ‘గన్’ కంటే ముందే ‘జగన్’ రావాలి.. రోజా రెక్వెస్ట్!

ఆడపిల్లకు కన్నీరొస్తే ‘గన్’ కంటే ముందు వైఎస్ జగన్ వస్తాడనే నమ్మకమని ఎమ్మెల్యే రోజా చెప్పుకొచ్చారు.

అఘాయిత్యాల‌కు పాల్పడితే ఉరిశిక్షే.. తేల్చేసిన జగన్!

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ సంఘటన తర్వాత ప్రభుత్వాల్లో చాలా మార్పులు సంభవిస్తున్నాయి.

నాకున్నది ఒక్క భార్యే.. కొందరేమో నాలుగో పెళ్లి కోసం తాపత్రయం!

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ ఘటన’పై గత పదిరోజులుగా చర్చ జరుగుతూనే ఉంది.