దుబాయ్‌లో సర్కారువారి పాట లాంగ్ షెడ్యూల్

  • IndiaGlitz, [Friday,January 22 2021]

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ త‌న 27వ సినిమా స‌ర్కారు వారిపాట‌ కోసం దుబాయ్ చేరుకున్న సంగ‌తి తెలిసిందే. దుబాయ్‌లో న‌మ్ర‌త బ‌ర్త్‌డేను సెల‌బ్రేట్ చేసిన మ‌హేశ్ ఈ నెల 25 నుండి సినిమా షూటింగ్‌లో పాల్గొన‌బోతున్నాడ‌ట‌. దాదాపు నెల రోజుల పాటు దుబాయ్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ ఉంటుంద‌ని స‌మాచారం. ముందుగా ఈ షెడ్యూల్‌ను అమెరికాలో ప్లాన్ చేశారు. అయితే కోవిడ్ ప్ర‌భావం త‌గ్గ‌క‌పోవ‌డంతో యు.ఎస్ షెడ్యూల్ కంటే ముందుగానే ఇండియా  షెడ్యూల్‌ను అనుకున్నారు. అయితే ఏమైందో ఏమో కానీ.. ఇప్పుడు యు.ఎస్ షెడ్యూల్‌ను దుబాయ్‌లో చిత్రీకరించాలని అనుకున్నారు. అందులో భాగంగానే స‌ర్కారు వారిపాట టీమ్ దుబాయ్ చేరుకుంద‌ని స‌మాచారం.దుబాయ్ షెడ్యూల్ తర్వాత  ఇండియాలో షెడ్యూల్స్ ప్లాన్ చేస్తారు. 

కీర్తిసురేశ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ చిత్రంలో  మ‌హేశ్ ఎన్నారై బిజినెస్ మేన్‌గా, ఫైనాన్సియ‌ర్‌గా.. ఇలా రెండు షేడ్స్‌లో క‌నిపిస్తార‌ని సమాచారం. రీసెంట్‌గా ఈ చిత్రంలో పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ గెస్ట్‌ అప్పియరెన్స్‌ ఇస్తారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్, 14 రీల్స్ ప్ల‌స్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ పతాకాల‌పై సినిమా రూపొందుతోంది.

More News

నాగ‌శౌర్య‌ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా రిలీజైన 'లక్ష్య' టీజ‌ర్‌

యంగ్ హీరో నాగశౌర్య హీరోగా సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ల‌క్ష్య’. సోనాలి నారంగ్ స‌మ‌ర్పణ‌లో

పిటిషన్ మొత్తం తప్పుల తడక.. వైసీపీకి సుప్రీంలో ఊహించని షాక్

స్థానిక ఎన్నికల విషయంలో హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైసీపీ ప్రభుత్వానికి షాక్ తగిలింది.

అదృష్టం అందలం ఎక్కిస్తే...బుద్ధి బురదలోకి దిగిన్నట్టుంది: పవన్

అదృష్టం అందలం ఎక్కిస్తే...బుద్ధి బురదలోకి దిగిందన్నట్టు వైసీపీ వైఖరి ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు.

అఖిల ప్రియను ఒంటరిని చేసిన టీడీపీ.. అసలు పట్టించుకోరేం..

హైదరాబాద్‌లో ప్రవీణ్ రావు అన్నదమ్ముల కిడ్నాప్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

ఆందోళనకరంగా శశికళ ఆరోగ్యం.. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ

అన్నాడీఎంకే మాజీ నాయకురాలు శశికళకు కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయింది.