అక్టోబర్ 18న 'సరోవరం'రిలీజ్

  • IndiaGlitz, [Wednesday,October 16 2019]

శ్రీలత సినీ క్రియేషన్స్ సరోవరం చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. అక్టోబర్ 18న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ సభ్యులు మీడియా సమావేశం అయ్యారు.

ఈ సందర్భంగా నిర్మాత ఎస్.శ్రీలత మాట్లాడుతూ... సరోవరం సినిమాను అందరూ ఇష్టపడి తీసాము. మమ్మల్ని ఆశీర్వదించడానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన పెద్దలకు, మీడియా వారికి ధన్యవాదాలు. అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా మీ అందరికి నచ్చుతుందని భావిస్తున్నాను అన్నారు.

డైరెక్టర్ సురేష్ యడవల్లి మాట్లాడుతూ... సరోవరం అనే గ్రామంలో జరిగిన కథ ఇది. ఎమోషనల్ గా నడిచే ఈ కథలో మలుపులు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. హీరో, హీరోయిన్ బాగా నటించారు. తనికెళ్ల భరణి, ఛత్రపతి శేఖర్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. సినిమా అన్నీ వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుంది. అక్టోబర్ 18న ఈ సినిమాను థియేటర్స్ లో చూసి మమ్మల్ని దీవించండని తెలిపారు.

జబర్దస్త్ నవీన్, రాము మాట్లాడుతూ... సరోవరం సినిమా అందమైన లొకేషన్స్ లో చిత్రీకరణ జరిగింది. మాస్ కు కావాల్సిన అంశాలతో పాటు యూత్ ను అట్రాక్ట్ చేసే ఎలిమేంట్స్ ఈ సినిమాలో ఉన్నాయన్నారు.

More News

దయచేసి నటించడం ఆపోద్దమ్మా రాములమ్మా..!

ఒకట్రెండు కాదు ఏకంగా 13 ఏళ్ల గ్యాప్ తర్వాత అలనాటి సీనియర్ నటి విజయశాంతి అలియాస్ రాములమ్మ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే.

ఎగ్జిట్ పోల్స్ నిషేధించిన ఎన్నికల కమిషన్

ఈ నెల 21న మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.

‘అర్జున్ రెడ్డి’ మూవీ చూసి లవర్‌ను చంపేశాడు.. !

జనాలపై సినిమాల ప్రభావం ఏ మాత్రం ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సినిమాలే మార్చేస్తాయని చెప్పలేం కానీ..

‘గే’ రూమర్స్‌పై నవదీప్ రియాక్షన్ ఇదీ..!

టాలీవుడ్ కుర్ర హీరో నవదీప్‌పై గత కొన్ని రోజులుగా ఓ పుకారు షికారు చేస్తున్న సంగతి తెలుస్తోంది.

ఆర్టీసీ కార్మికులపై ఎస్మా ప్రయోగిస్తే పరిస్థితేంటి..: హైకోర్ట్

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టులో వాదనలు జరిగాయి. సుధీర్ఘంగా విచారించిన హైకోర్టు చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని అభిప్రాయపడింది.