సరైనోడుకి యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ బోర్డ్..

  • IndiaGlitz, [Monday,April 18 2016]

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన‌ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ స‌రైనోడు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్ నిర్మించారు
. ఈ చిత్రంలో అల్లు అర్జున్ స‌ర‌స‌న కేథ‌రిన్, ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టించారు. సెన్సార్ బోర్డ్ స‌రైనోడు సినిమాకి యు/ఎ స‌ర్టిఫికెట్ ఇచ్చింది. బ‌న్ని స్టైల్ యాక్టింగ్, బోయ‌పాటి మార్క్ యాక్ష‌న్ తో వ‌స్తున్న స‌రైనోడు సినిమా పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. త‌మ‌న్ అందించిన ఆడియోకి మంచి రెస్పాన్స్ వ‌స్తుండ‌డంతో సినిమాపై రోజురోజుకు అంచ‌నాలు పెరుగుతున్నాయి. శ్రీకాంత్ బన్ని బాబాయ్ గా న‌టించ‌గా, ఆది పినిశెట్టి విల‌న్ గా న‌టించారు. అడియోన్స్ లో మంచి క్రేజ్ ఏర్ప‌రుచుకున్న స‌రైనోడు సినిమాని ప్ర‌పంచ వ్యాప్తంగా ఈనెల 22న రిలీజ్ చేయ‌నున్నారు.

More News

రవితేజతో శ్రీవాస్

బెంగాల్ టైగర్ తర్వాత మాస్ మహారాజా రవితేజ నూతన దర్శకుడు చక్రి దర్శకత్వంలో రాశిఖన్నా హీరోయిన్ గా డివివి దానయ్య నిర్మాత ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

నయనతార మరో హర్రర్ క్రైమ్...

గతేడాది మయూరి చిత్రంలో టైటిల్ రోల్ పోషించి భయపెట్టిన నయనతార ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా బిజీగా ఉంది. వరుస సినిమాల అవకాశాలను దక్కించుకుంటున్న ఈ మలయాళ ముద్దుగుమ్మ ఇప్పుడు మరో హర్రర్ క్రైమ్ చిత్రంలో నటించబోతుందట.

జెడి చక్రవర్తి పెళ్లి

శివలో జెడిగా తనదైన మార్కు నటనను ప్రధర్శించి తర్వాత హీరోగా గులాబి,

నితిన్ కు మహేష్ కు అడ్డే...

నితిన్,సమంత హీరోహీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం 'అ..ఆ...'.త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఆ సినిమా నేను చేయడం లేదు: మెహరీన్

రాజ్ తరుణ్ హీరోగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కనున్న "శతమానం భవతి" చిత్రంలో కథానాయికగా "కృష్ణగాడి వీరప్రేమగాధ" ఫేమ్ మెహరీన్ ను కథానాయికగా ఎంపిక చేసినట్లు వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని, అసలు తనను ఆ సినిమా గురించి ఎవరూ ఎంక్వైరీ కూడా చేయలేదని మెహరీన్ స్పష్టం చేసింది.