ఆస్పత్రి, ప్రేమ వ్యవహారాలు ‘శశి లలిత’లో చూపిస్తాం!

  • IndiaGlitz, [Monday,May 20 2019]

తమిళ రాజకీయాలను ఒంటి చేత్తో శాసించి.. ముఖ్యమంత్రిగా సేవలు అందించిన దివంగత నేత జయలలిత జీవిత చరిత్ర.. ఆమె నెచ్చలి శశికళపై ప్రముఖ దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి జయలలిత బయోపిక్‌ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రానికి ‘శశిలలిత’ అని పేరుపెట్టిన కేతిరెడ్డి..  ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. తాజాగా ప్రెస్‌మీట్ పెట్టి సినిమాకు సంబంధించి పలు ఆసక్తిర విషయాలు వెల్లడించారు.

శోభన్ బాబుతో ప్రేమ వ్యవహారం కూడా..!

‘శశి లలిత’ చిత్ర నిర్మాణంకు సర్వం సిద్ధం.  తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషలలో ‘శశి లలిత’ చిత్రం తెరకెక్కనున్నది. ఈ సినిమా ద్వారా ఆమెకు జరిగిన అన్యాయం చూపించ బోతున్నాం. సినిమాలో యదార్థ సంఘటనలు తెరకెక్కించనున్నాం. 78 రోజులపాటు ఆస్పత్రిలో అసలేం జరిగింది..?. జయలలిత పాత్రలో కాజల్ దేవగన్, శశికళ పాత్రలో అమల పాల్ నటించబోతున్నారు. జయలలిత బాల్యం.. నుంచి చిత్ర పరిశ్రమకు రావడం.. శోభన్ బాబుతో ప్రేమ వ్యవహారం. ఇలా అన్ని అంశాలూ కవర్ చేశాం.

రెండన్నర గంటల్లో జయలలిత జీవితంలో జరిగిన ముఖ్య సంఘటనలు అన్ని వివరించబోతున్నాం. 'లక్ష్మీస్ వీరగ్రంధం’' 'శశిరేఖ'.. ఎలెక్షన్ కోడ్ వలన ఆసల్యమైంది. కోడ్ తొలగిన వెంటనే సినిమా రిలీజ్ చేస్తాం. జూన్ ముగింపులో ‘లక్ష్మీస్ వీరగ్రంధం’ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. వచ్చే ఏడాదిలో శశి లలిత రీలీజ్ చేయబోతున్నాం అని కేతిరెడ్డి చెప్పుకొచ్చారు.

సో.. మొత్తానికి చూస్తే కేతిరెడ్డి 'శశి లలిత' చిత్రంతో డేంజర్ ఫీట్ వేయబోతున్నాడని చెప్పుకోవచ్చు. శోభన్ బాబుతో ప్రేమ వ్యవహారం అనేది వివాదాలకు దారి తీయకుండా ఎలా మేనేజ్ చేస్తారో వేచి చూడాల్సిందే మరి. అయితే ఈయన తీస్తానన్న.. తీసిన సినిమాలు చాలా వరకు రిలీజ్ వరకు వచ్చిన దాఖలాలు చాలా తక్కువే.. మరి ఈ సినిమా అయినా రిలీజ్ అవుతుందా లేకుంటే నాలుగు రోజులు హడావుడి చేసి కేతిరెడ్డి మిన్నకుండిపోతారో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.

More News

మే 31న  'అభినేత్రి 2' విడుద‌ల‌

ప్ర‌భుదేవా, త‌మ‌న్నా జంట‌గా న‌టించిన 'అభినేత్రి' తెలుగులో ఎంత పెద్ద విజ‌యం సాధించిందో తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన  'అభినేత్రి 2' మే 31న విడుద‌లవుతుంది.

ఫ్యాన్స్‌కు రేపు సర్‌ఫ్రైజ్ ఇవ్వబోతున్న ప్రభాస్...

‘బాహుబలి’ పార్ట్ 1, పార్ట్2 సినిమాలతో రెబల్ స్టార్ ప్రభాస్‌ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయిందన్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రభాస్

సినీ గేయ రచయిత చంద్రబోస్‌కు మాతృవియోగం

టాలీవుడ్ ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్ ఇంట విషాదం నెలకొంది. బోస్ తల్లి మదనమ్మ సోమవారం మధ్యాహ్నం గుండెపోటుతో మృతి చెందారు. గత కొన్ని రోజులుగా గుండెపోటు వ్యాధితో బాధ పడుతున్న ఆమె సోమవారం తుదిశ్వాస

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై చంద్రబాబు ఏమన్నారంటే...

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా జరిగిన ఎన్నికలకు గాను ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఆదివారం సాయంత్రం వెల్లడైన సంగతి తెలిసిందే.  ఏపీలో టీడీపీనే అధికారంలోకి వస్తుందని లగడపాటి సర్వే...

మే 31న 'ఫ‌ల‌క్‌నుమా దాస్‌' విడుద‌ల‌

విశ్వ‌క్ సేన్ హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం 'ఫ‌ల‌క్‌నుమా దాస్‌'. వాజ్ఞ్మ‌యి క్రియేష‌న్స్ క‌రాటే రాజు స‌మ‌ర్ప‌ణ‌లో విశ్వ‌క్ సేన్ సినిమాస్‌, టెర్ర‌నోవా పిక్చ‌ర్స్ బ్యాన‌ర్స్‌