వంశీ నీ సినిమాలు నాకు న‌చ్చ‌వ్ అంటున్న డైరెక్ట‌ర్..

  • IndiaGlitz, [Friday,March 25 2016]

వంశీ..నీ సినిమాలు నాకు న‌చ్చ‌వ్ అంటున్న డైరెక్ట‌ర్... స‌తీష్ కాశెట్టి. ఇంత‌కీ స‌తీష్ కాశెట్టి ఎవ‌రు అనుకుంటున్నారా..? హోప్, క‌ల‌వ‌ర‌మాయే మ‌దిలో, టెర్ర‌ర్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు. వంశీ పైడిప‌ల్లి సినిమాలు మున్నా, బృందావ‌నం, ఎవ‌డు..చిత్రాలు చూసి ఇక వంశీ సినిమాలు చూడ‌కూడ‌దు అని నిర్ణ‌యించుకున్నాడ‌ట డైరెక్ట‌ర్ స‌తీష్ కాశెట్టి. అయితే... ప‌నికిరాని కామెడీ ట్రాక్స్, అవ‌స‌రం లేని ఫైట్స్..కావాల‌నుకునే ఈరోజుల్లో...ఎమోష‌న్ అంటే ఎందుకు అనుకునే ఏక్ట‌ర్స్ , ప్రొడ్యూస‌ర్స్ ఉన్న ఈరోజుల్లో...ఊపిరి ఆడ‌క‌ చ‌చ్చిపోతున్నతెలుగు సినిమాకి ప్రాణం పోసిన సినిమా ఊపిరి అంటూ స‌తీష్ కాశెట్టి స్టేట్ మెంట్ ఇచ్చేసారు.

ఈ సినిమాని నిర్మాత కొర‌కు, కార్తీ కోసం చూసాను. సినిమా చూసాకా ఆశ్చ‌ర్య‌పోయాను. సినిమాకి ఊపిరి కార్తీ అంటూ స్పందించాడు డైరెక్ట‌ర్ స‌తీష్ కాశెట్టి. అంతా బాగానే ఉంది కానీ...తెలుగు సినిమా న‌డ‌క - న‌డ‌త‌ను మార్చిన నిజ‌మైన ట్రెండ్ సెట్ట‌ర్ & సెల్యూలాయిట్ సైంటిస్ట్ నాగార్జున గురించి ఒక మాట కూడా మాట్లాడ‌క‌పోవ‌డం...త‌మిళ హీరో కార్తీ కోస‌మే ఈ సినిమా చూసాన‌ని చెప్ప‌డం మాత్రం ఏం బాగోలేదు స‌తీష్ గారు.

More News

సునీల్ కి ఇదో రికార్డు

క‌మెడీయ‌న్‌గా స్టార్ డ‌మ్‌ని చూసిన వైనం సునీల్‌ది. స్టార్ క‌మెడీయ‌న్‌గా రాణిస్తున్న స‌మ‌యంలో.. ఒక్కో ఏడాదికి ప‌దుల సంఖ్య‌లో  సినిమాలు చేసిన సంద‌ర్భాలు త‌న‌కున్నాయి.

హ్యాట్రిక్ లే హ్యాట్రిక్‌లు

జ‌న‌ర‌ల్‌గా ఒక సినిమాకి ఒక‌టో రెండో హ్యాట్రిక్‌లు ముడిప‌డి ఉంటాయి. అయితే నాగార్జున‌, కార్తీ, త‌మ‌న్నా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించగా  ఈ శుక్ర‌వారం విడుద‌లైన‌ ద్విభాషా చిత్రం 'ఊపిరి' మాత్రం ఏకంగా ఐదు హ్యాట్రిక్‌ల‌ను సొంతం చేసుకుంది.

నిత్యాకి ఎంతో స్పెష‌ల్‌

స్టార్ హీరోయిన్ అనే ట్యాగ్‌లైన్ కంటే పెర్‌ఫార్మెన్స్ ఓరియెంటెడ్ హీరోయిన్ అనే ట్యాగ్‌లైన్ కోస‌మే తప‌న ప‌డే నాయిక నిత్యా మీన‌న్‌. కేర‌ళ నుంచి దిగుమ‌తి అయిన నిత్యా.. తెలుగు, త‌మిళ భాష‌ల్లో త‌న‌కంటూ ప్ర‌త్యేక ఇమేజ్‌ని సొంతం చేసుకుంది.

మ‌హేష్ వ‌స్తాడా?  వ‌దులుకుంటాడా?

'శ్రీ‌మంతుడు' వంటి సంచ‌ల‌న విజ‌యం త‌రువాత సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు న‌టిస్తున్న చిత్రం 'బ్ర‌హ్మోత్స‌వం'. శ్రీ‌కాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమాని వేస‌వి కానుక‌గా విడుద‌ల చేయాల‌న్న ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. వేస‌వి సంద‌ర్భంలో.. మ‌హేష్ క‌థానాయ‌కుడుగా సినిమా వ‌చ్చి ఈ సంవత్స‌రంతో ప‌దేళ్లు పూర్త‌వుతున్నాయ&

విభేదాలపై ఘాటుగా స్పందించిన విశాల్..

చెన్నైలో ఇటీవ‌ల జ‌రిగిన న‌డిగ‌ర్ సంఘం ఎన్నిక‌ల్లో శ‌ర‌త్ కుమార్ వ‌ర్గం పై విశాల్ వ‌ర్గం పోటీ చేసి విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఎన్నిక‌లు జ‌ర‌గ‌డం..