బ్లాక్‌మనీపై అస్త్రం  : ఆకట్టుకుంటోన్న సత్యదేవ్ ‘‘గాడ్సే’’ టీజర్

  • IndiaGlitz, [Monday,December 20 2021]

విలక్షణమైన కథలతో యూత్‌లో మంచి క్రేజ్ దక్కించుకున్న యువ హీరో సత్యదేవ్. రోటీన్ మాస్ మసాలా సినిమాలు కాకుండా కథకు స్కోప్ వుండే చిత్రాలు చేస్తూ.. సత్యదేవ్ సినిమా అంటే ఏదో విషయం వుందనేంతగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు ఈ వైజాగ్ కుర్రాడు. తాజాగా ఆయన నటిస్తోన్న చిత్రం ‘‘గాడ్సే’’. సీకే స్క్రీన్స్ బ్యాన‌ర్ పై సీ కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ మూవీని గోపి గణేశ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా ద్వారా మ‌ల‌యాళ న‌టి ఐశ్వర్య ల‌క్ష్మి మొద‌టి సారి తెలుగు తెరపై ఎంట్రీ ఇస్తున్నారు. అలాగే నాస‌ర్, సాయాజీ షిండే, కిషోర్, బ్ర‌హ్మ‌జీ కీల‌క పాత్ర‌ల‌లో న‌టిస్తున్నారు.

ఇప్ప‌టికే వ‌చ్చిన పోస్ట‌ర్లు ఈ సినిమాపై అంచ‌నాలు పెంచ‌గా.. .. తాజాగా ఈ సినిమా లో నుంచి మ‌రో బిగ్ అప్డేట్ వ‌చ్చింది. గాడ్సే టీజ‌ర్ ను విడుద‌ల చేసింది చిత్ర బృందం. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా సోమవారం విడుద‌లైన ఈ టీజ‌ర్‌లో ‌స‌త్యదేవ్ దుమ్ము లేపాడు. అవినీతి రాజకీయాలను అరికట్టాలనే లక్ష్యంతో ఉన్న యువకుడిగా ఆయన కనిపిస్తారు. సత్యదేవ్ కోసం అధికారులు గాలిస్తుండగా, ఐశ్వర్య లక్ష్మీ ఇన్వెస్ట్‌గేట్ చేసే ఆఫీసర్‌గా కనిపిస్తున్నారు. “ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకోనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు…” అంటూ టీజర్ ప్రారంభమవుతోంది.

“సాధారణంగా ఉద్యోగం చేస్తే డబ్బులు వస్తాయి, వ్యాపారం చేస్తే డబ్బులు వస్తాయి, వ్యవసాయం చేస్తే డబ్బులు వస్తాయి… కానీ సేవ చేస్తున్నందుకు మీకు వందల వేల లక్షల కోట్లు ఎలా వస్తున్నాయా .. ఎందుకంటే మీరంతా సర్వీస్ పేరుతో పబ్లిక్ మనీ లూటీ చేస్తున్నారు” అంటూ సత్యదేవ్ పలికిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. అన్నింటికి మించి సునీల్ కశ్యప్ బ్యాక్ ఇచ్చిన గ్రౌండ్ స్కోరు సినిమాపై అంచనాలను పెంచేసింది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో వున్న గాడ్సేను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

More News

పనామా పేపర్స్ లీక్ కేసు: ఐశ్వర్యరాయ్‌కి ఈడీ నోటీసులు.. ఉలిక్కిపడ్డ బాలీవుడ్

నిన్న మొన్నటి వరకు డ్రగ్స్ వ్యవహారంతో బాలీవుడ్ బిగ్‌షాట్‌లను కేంద్రం వణికించిన సంగతి తెలిసిందే.

ఎవరీ వీజే సన్నీ.. జర్నలిస్ట్ స్థాయి నుంచి బిగ్‌బాస్ విన్నర్ ఎలా కాగలిగాడు..?

ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఇద్దరు కలిసినా వినిపిస్తున్న మాట వీజే సన్నీ.

‘అరె షన్నూ ఏంట్రా ఇది’ .. ఆడమంటే హగ్గులిచ్చావు, సన్నీ నీకు స్ట్రోక్ ఇచ్చాడు

బిగ్‌బాస్ తెలుగు 5వ సీజన్ ముగిసింది. తొలి నుంచి సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చకు తగట్టుగానే వీజే సన్నీ విజయం సాధించాడు.

హంసానందినికి క్యాన్సర్...  ‘‘ కాలానికి నేను బాధితురాలిగా వుండను’’ అంటూ ఎమోషనల్ పోస్ట్

టాలీవుడ్‌లో హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, ఐటెం గర్ల్‌గా పలు సినిమాల్లో నటించిన హంసానందిని మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

స్టార్ మా సరికొత్త సీరియల్ 'శ్రీమతి శ్రీనివాస్'

ఒక కొత్త రకం కథ తో స్టార్ మా అందిస్తున్న ఒక సరికొత్త సీరియల్ "శ్రీమతి శ్రీనివాస్". నిజానికీ అబద్ధానికి మధ్య దూరం ఒక అనుబంధం అనే సున్నితమైన కథాంశంతో స్టార్