ఒక్క మిస్డ్ కాల్‌లో ఎస్‌బీఐ పర్సనల్ లోన్..

  • IndiaGlitz, [Wednesday,February 17 2021]

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ కావాలంటే మామూలు విషయం కాదు.. చాలా పెద్ద ప్రాసెస్. అలాంటిది లోను కావాలంటే.. బాబోయ్ అక్కర్లేదు.. వేరే ఏ ప్రైవేటు బ్యాంకో చూసుకుంటే అయిపోతుంది అనిపిస్తుంది కాదా.. కానీ ఇప్పుడు ఒక్క మిస్డ్ కాల్ లేదంటే ఎస్ఎంఎస్‌తో మనకు లోను వచ్చేస్తుంది. ఎస్‌బీఐ ఎక్స్‌ప్రెస్ పర్సనల్ లోన్ పొందేందుకు ఒక్క మిస్డ్ కాల్ లేదంటే ఒక్క ఎస్ఎంఎస్ చాలు. అయితే ఈ లోన్ ఏ ఏ సందర్భాల్లో తీసుకోవచ్చో ఎస్‌బీఐ వివరించింది. దేశంలోనే అగ్ర‌స్థాయి బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తక్షణ ఆమోదంతో వినియోగ‌దారుల‌కు వ్య‌క్తిగ‌త రుణాన్ని అందిస్తుంది.

వివాహం, విహార‌యాత్ర‌, ఊహించ‌ని అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి, ప్ర‌ణాళిక‌బ‌ద్ద‌మైన కొనుగోలు‌ కోసం ఎస్‌బీఐ ఎక్స్‌ప్రెస్ పర్సనల్ లోన్ ఇస్తుంది. ఎస్‌బీఐ క‌స్ట‌మ‌ర్లు దాని వెబ్‌సైట్‌లో పేర్కొన్న బ్యాంక్ ఎస్‌బీఐ యొక్క ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ ప‌ర్స‌న‌ల్ లోన్ ద్వారా క‌నీస డాక్యుమెంటేష‌న్‌తో స‌త్వ‌ర రుణ ఆమోదం పొందొచ్చు. వ్య‌క్తిగ‌త రుణం అవ‌స‌ర‌మైన వారు 7208933145 నంబ‌ర్‌కు ఎస్ఎంఎస్ పంప‌వ‌చ్చు లేదా 7208933142 నంబ‌ర్‌కు మిస్డ్‌ కాల్ ఇవ్వవ‌చ్చు. ఎస్‌బీఐ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ ప‌ర్స‌న‌ల్ లోన్‌ ద్వారా రూ.20 లక్షల వరకూ రుణం తీసుకోవచ్చు.

వడ్డీ రేటు కూడా తక్కువ(9.6%).. తీసుకున్న రుణం బ్యాలెన్స్‌పైనే వడ్డీ ఉంటుంది. ప్రాసెసింగ్ చార్జీలు సైతం తక్కువ. రుణానికి సెక్యూరిటీ గాని హామీ గానీ అక్క‌ర్ల‌లేదు. ఎస్‌బీఐలో జీతం ఖాతా ఉన్న వ్య‌క్తులై ఉన్న వారికి మాత్రమే ఈ రుణం వర్తిస్తుంది. క‌నీసం నెల ఆదాయం రూ. 15,000 ఉండాలి. సెంట్ర‌ల్‌, స్టేట్ గ‌వ‌ర్న‌మెంట్ ఉద్యోగులై ఉండాలి లేదంటే సెంట్ర‌ల్ ప‌బ్లిక్ సెక్టార్ యూనిట్స్, లాభాల‌ను ఆర్జించే రాష్ట్ర ప‌బ్లిక్ సెక్టార్ యూనిట్స్.. ప్ర‌ముఖ జాతీయ విద్యాసంస్థ‌ల ఉద్యోగులై ఉండాలి. క‌నీస రుణ మొత్తం రూ. 25,000 కాగా.. గ‌రిష్ట రుణ మొత్తం రూ.20 ల‌క్ష‌లు ఇవ్వనుంది.

More News

అఖిల్ పేరు వినగానే వెంటనే సంతకం చేసేశా: మోనాల్

ప్రముఖ రియాల్టీ షో తెలుగు బిగ్‌బాస్ ద్వారా బాగా హైలైట్ అయిన జంట ఏదైనా ఉందంటే అది అఖిల్-మోనాల్‌ల జంట. ఈ జంట కోసమే బిగ్‌బాస్ చూసిన వాళ్లూ లేకపోలేదు‌.

వైఎస్ షర్మిలపై తెలంగాణ మంత్రి వ్యాఖ్యలు

వైఎస్ రాజశేఖరరెడ్డి తనయురాలు షర్మిల పార్టీ ప్రారంభించినప్పటి నుంచి మంత్రి గంగుల కమలాకర్ ఆమెపై ఒంటికాలిపై లేస్తున్నారు. ఆమెను ఏదో ఒక విధంగా..

ఐదో రోజు ‘ఉప్పెన’ ఎంత కలెక్ట్ చేసిందంటే..

మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన ‘ఉప్పెన’ చిత్రం వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. శుక్రవారం థియేటర్స్‌లో విడుదలైన ఈ సినిమా ఇంకా హవా కొనసాగిస్తూనే ఉంది. తొలిరోజు నుంచి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం

ఆచార్య క్రియేషన్స్, అవికా స్క్రీన్ క్రియేషన్స్ సంయుక్త నిర్మాణంలో ఆచార్య క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం.3

సరికొత్త కథలను ఎంపిక చేసుకోవడం, కంటెంట్ బేస్డ్ సినిమాలను ప్రేక్షకులకు ముందుకు తీసుకు రావడం ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీలో, ప్రేక్షకుల్లో ఆచార్య క్రియేషన్స్ ప్రత్యేక గౌరవం, మంచి పేరు తెచ్చుకుంది.

‘రాధేశ్యామ్’ ఆసక్తికర ఫోటో విడుదల

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే జంటగా నటించిన ప్యాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.