కాఫీ ప్రియులు తస్మాత్ జాగ్రత్త అంటున్న పరిశోధకులు!

  • IndiaGlitz, [Saturday,February 20 2021]

పొద్దున లేవగానే చాలా మందికి వేడి వేడి కాఫీ గొంతు దిగనిదే రోజు గడవదు. మరికొందరికైతే ఏ పని చేయాలన్నా కప్పు కాఫీ పడాల్సిందే. ఒక కప్పుతో ఆగితే హ్యాపీ.. మరి కాదంటే ఐదు కప్పులు చాలు.. కానీ అంతకు మించితే మాత్రం హృద్రోగాలు రావడం ఖాయమని వైద్యులు తేల్చి చెబుతున్నారు. ప్రతి రోజు ఐదు కప్పులు మాత్రమే లిమిట్ అని అంతకు మించితే హృద్రోగాల నుంచి తప్పించుకోలేరని వైద్యులు తేల్చి చెబుతున్నారు. దీనిపై యూనివర్సిటీ ఆఫ్‌ సౌత్‌ ఆస్ట్రేలియా ప‌రిశోధ‌కులు ఇందుకు సంబంధించిన వివ‌రాలను తాజాగా వెల్ల‌డించారు.

ప్రతిరోజూ ఐదు కప్పులకు మించి కాఫీ తాగుతున్న వారిలో.. కాఫీలో ఉండే కఫెస్టోల్‌ అనే రసాయన మూలకం కార‌ణంగా మనిషిలో కొవ్వు పేరుకుపోతోంద‌ని వివ‌రించారు. దీంతో వారిలో రక్త ప్రసరణ సరిగ్గా‌ జరగకపోవ‌డంతో హృద్రోగాలు వ‌స్తున్నాయ‌ని పరిశోధకులు చెబుతున్నారు. కాఫీ తాగనిదే ఏ పనిచేయలేకపోతున్నామని గంటకో కప్పు కాఫీ తాగితే ఇబ్బందులు తప్పవని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.

మరో విషయం ఏంటంటే.. ఫిల్టర్‌ చేయని కాఫీలో ఈ కఫెస్టోల్ అధికంగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. కాఫీ ప్రియులు ఫిల్టర్‌ కాఫీకి ప్రాధాన్య‌త ‌ఇస్తే కొంతలో కొంత వరకూ మెరుగ్గా ఉంటుందని తెలిపారు. త‌మ అధ్య‌య‌నాన్ని ఇంకా కొన‌సాగిస్తున్న‌ట్లు పరిశోధకులు తెలిపారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు రోజుకు 300 కోట్ల కప్పుల కాఫీని తాగుతున్నారని అధ్యయనంలో తేలింది. మ‌రోవైపు హృద్రోగాల‌తో ఏడాదికి 1.79 కోట్ల మంది ప్రాణాలు కోల్పోతున్నారని తేలింది. కాబట్టి కాఫీ ప్రియులు తస్మాత్ జాగ్రత్త అని పరిశోధకులు చెబుతున్నారు.

More News

షర్మిల నోట జై తెలంగాణ మాట..

వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, ఏపీ సీఎం జగన్ సోదరి షర్మిల తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్‌గా మారుతున్నారు.

సండే స్టార్ మా లో ప్రేమలోకం !

ప్రేమంటే రెండు అక్షరాల మహాకావ్యం. దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏం చెప్పినా చెప్పడానికి ఎంతో మిగిలే ఉంటుంది.

న్యాయవాద దంపతుల హత్య కేసు పుట్టా మధు మెడకు చుట్టుకుంటోందా?

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతుల హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.

న్యాయవాద దంపతుల హత్య వివరాలను వెల్లడించిన పోలీసులు..

న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు, నాగమణిల హత్య కేసులో ప్రధాన నిందితులు ముగ్గురిని అరెస్ట్ చేశామని వెల్లడిస్తూ రామగుండం పోలీస్ కమిషనరేట్

స్కైలైన్ వ్యూ ఉన్న ఇంటిని కొనుగోలు చేసిన పూజ!

హీరోయిన్ పూజా హెగ్డే కెరీర్ ప్రస్తుతం పీక్ స్టేజ్‌లో ఉంది. టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది.