పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో 'సీతమ్మ అందాలు-రామయ్య సిత్రాలు'

  • IndiaGlitz, [Tuesday,November 17 2015]

ఉయ్యాల జంపాలా, సినిమా చూపిస్త మామ చిత్రాలతో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాందించుకున్న రాజ్ తరుణ్ ప్రస్తుతం నటించిన కుమారి 21 ఎఫ్' చిత్రం విడుదలకు సిద్ధం గా వుంది. ఈ సినిమా తర్వాత రాజ్ తరుణ్ నటిస్తున్న చిత్రం సీతమ్మ అందాలు-రామయ్య సిత్రాలు'. శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వంలో శ్రీశైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీమతి పూర్ణిమ ఎస్‌బాబు సమర్పణలో ఎస్.శైలేంద్రబాబు, కెవీ శ్రీధర్ రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తిచేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటోంది.

ఈ సందర్భంగా నిర్మాతలు చిత్ర విశేషాలను తెలియజేస్తూ.. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో సున్నితమైన భావోద్వేగాలకు, వినోదానికి పెద్ద పీటవేశాం. రాజ్‌తరుణ్ పాత్ర సరికొత్తగా వుంటుంది. ఈ చిత్రం ద్వారా అర్తన అనే నూతన హీరోయిన్ తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం కాబోతుంది. నవ్యమైన కథ, కథనాలతో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తిచేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నెలాఖరుకి పాటలు విడుదల చేసి, సినిమాను డిశంబర్ లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము. ప్రస్తుతం మా హీరో రాజ్‌తరుణ్ నటించిన కుమారి 21 ఎఫ్' విడుదలకు సిద్ధంగా వుంది. ఆ సినిమా టీం కి, మా హీరో కి.. అల్ ది బెస్ట్...' అని తెలిపారు.

రాజ్‌తరుణ్, అర్తన, రణధీర్, రాజా రవీంద్ర, ఆదర్శ్, షకలక శంకర్, మధునందన్, విజయ్, జోగినాయుడు, సురేఖావాణి, శ్రీలక్ష్మి, హేమ, రత్నసాగర్, నవీన్, భార్గవి తదితరలు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్, పాటలు: సుద్ధాల అశోక్‌తేజ, రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల, వనమాలి, కృష్ణచైతన్య, ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్, కెమెరా: విశ్వ, ప్రొడక్షన్ కంట్రోలర్: కొర్రపాటి వెంకటరమణ, సమర్పణ; శ్రీమతి పూర్ణిమ ఎస్‌బాబు, కథ-స్కీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: శ్రీనివాస్ గవిరెడ్డి.

More News

క్యాన్సర్ బాధితులకు అండగా నిలిచిన సావిత్ర సీరియల్ యూనిట్

గత 200 ఎపిసోడ్స్ గా బుల్లి తెర అభిమానులను అలరిస్తున్న ' సావిత్రి ' సీరియల్ టీమ్ ..క్యాన్సర్ భాదితులకు అండగా నిలిచింది..ఈ సీరియల్ 200 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న సందర్బంగా సావిత్రి సీరియల్ యూనిట్

నారా రోహిత్ 'సావిత్రి' రెండవ షెడ్యూల్ ప్రారంభం

యంగ్ జనరేషన్ హీరో లలో మంచి పేరు సంపాదించుకుంటున్న నారా రోహిత్ హీరో గా , నందిత హీరోయిన్ గా రూపొందుతోన్న చిత్రం 'సావిత్రి'.

స్వాతికి మ‌రో ఆఫ‌ర్..

అష్టా చ‌మ్మా, డేంజ‌ర్, గోల్కండ హైస్కూల్, ఆడ‌వారి మాట‌ల‌కు అర్ధాలే వేరులే..ఇలా డిఫ‌రెంట్ మూవీస్ లో న‌టించి మెప్పించిన హీరోయిన్ క‌ల‌ర్స్ స్వాతి.

అర‌వింద్ అంత డిమాండ్ చేస్తున్నాడా..

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ త‌ని ఓరువ‌న్ రీమేక్ లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కిస్తున్నారు.

సూర్య 24 మూవీ రిలీజ్ వాయిదా..

హీరో సూర్య‌, మ‌నం ఫేం విక్ర‌మ్ కుమార్ కాంబినేష‌న్ లో రూపొందుతున్నక్రేజీ మూవీ 24. ఈ చిత్రంలో సూర్య స‌ర‌స‌న స‌మంత‌, నిత్యా మీన‌న్ న‌టిస్తున్నారు.