'సీటీమార్‌' ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌!!

  • IndiaGlitz, [Monday,January 27 2020]

మ్యాచోస్టార్‌ గోపీచంద్‌ హీరోగా మాస్‌ డైరెక్టర్‌ సంపత్‌ నంది దర్శకత్వంలో 'యు టర్న్‌'లాంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని అందించిన శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం.3గా శ్రీనివాసా చిట్టూరి నిర్మాత‌గా హై బడ్జెట్‌, అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతోన్న‌ భారీ చిత్రం' సీటీమార్‌'. ఈ ప్రెస్టీజియస్‌ మూవీలో మిల్కీబ్యూటి తమన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా మరో హీరోయిన్ గా దిగంగన సూర్యవంశీ నటిస్తోంది. తరుణ్ అరోర ప్రతి నాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి మెలోడి బ్ర‌హ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ను ఈ రోజు ఉద‌యం 8.47నిమిషాల‌కి విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. ఈ సందర్భంగా ..

చిత్ర నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ - ''ఇటీవ‌ల హైద‌రాబాద్, రాజ‌మండ్రిలో బిగ్ షెడ్యూల్ పూర్తి చేసుకొని ఈరోజు నుండి ఆర్‌.ఎఫ్‌.సిలో కొత్త షెడ్యూల్ ప్రారంభించాం. నాన్ స్టాప్‌గా షెడ్యూల్ జ‌రిపి స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. గోపిచంద్ కెరీర్ లోనే ఇది హై బడ్జెట్ ఫిలిం. హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో ప్రెస్టీజియస్‌ మూవీగా రూపొందుతోంది. హీరో గోపిచంద్ కి భారీ క‌మ‌ర్షియ‌ల్ మూవీ'' అన్నారు.

మ్యాచో స్టార్‌ గోపీచంద్‌, మిల్కీబ్యూటి తమన్నా, దిగంగన సూర్యవంశి, తరుణ్ అరోర, భూమిక, పోసాని కృష్ణమురళి, రావురమేష్, అన్నపూర్ణమ్మ, ప్రగతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డిఓపి: సౌందర్‌ రాజన్‌, సంగీతం: మణిశర్మ, ఎడిటర్: తమ్మిరాజు, ఆర్ట్‌ డైరెక్టర్‌: డి.వై.సత్యనారాయణ, సమర్పణ: పవన్‌ కుమార్‌, నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి, కథ-మాటలు-స్క్రీన్‌ప్లే- దర్శకత్వం: సంపత్‌ నంది.

More News

యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ 'వి'.. సుధీర్‌బాబు ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

నేచుర‌ల్ స్టార్ నాని, మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ `వి`. తొలి రెండు చిత్రాల్లో నానిని డిఫ‌రెంట్‌గా చూపించిన డైరెక్ట‌ర్ మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి

'83' ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

భార‌త క్రికెట్ చ‌రిత్ర‌లో 1983 సంవ‌త్స‌రం భార‌త క్రికెట్ జ‌ట్టు విశ్వ విజేత‌గా ఆవిర్భ‌వించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆ విజ‌యం అంత సుల‌భంగా ద‌క్క‌లేదు.

రామోజీ రావుపై ఆగ్రహంతో ఊగిపోయిన బొత్స

2019 ఎన్నికల అనంతరం అఖండ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘ఈనాడు’,‘ఆంధ్రజ్యోతి’ మీడియా సంస్థలపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్న సంగతి తెలిసిందే.

గణతంత్ర వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా తెలుగు రాష్ట్రాల శకటాలు!

యావత్ భారత్ దేశ వ్యాప్తంగా 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దేశ రాజధాని న్యూ ఢిల్లీలోని రాజ్పథ్‌లో నిర్వహించిన ఈ వేడుకల్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్జాతీయ జెండాను ఆవిష్కరించి..

రిపబ్లిక్ డే ఉత్సవాల్లో పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

భారతదేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇవాళ అమరావతిలోని మంగళగిరి జనసేన కార్యాలయంలో ఈ వేడుకలను జనసేన ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా జనసేన