‘ల‌వ్‌స్టోరి’ గురించి శేఖ‌ర్ క‌మ్ముల ఏమ‌న్నారంటే..!

ఆనంద్‌, గోదావ‌రి, హ్యాపీడేస్‌, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, ఫిదా వంటి చిత్రాల‌తో సెన్సిబుల్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్న శేఖ‌ర్ క‌మ్ముల ఇప్పుడు నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి జంట‌గా ‘ల‌వ్‌స్టోరి’ సినిమాను రూపొందిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సీజ‌న్‌లో సినిమాను విడుద‌ల చేయాల‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు భావించారు. కానీ కరోనా ప్ర‌భావం ప్రారంభం కావ‌డంతో సినిమా తుది ద‌శ షూటింగ్ ఆగింది.

రీసెంట్‌గా ఈ సినిమా గురించి శేఖ‌ర్ క‌మ్ముల మాట్లాడారు. సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. రెండు పాటలు, కొన్ని సన్నివేశాల చిత్రీకరణ మాత్రమే మిగిలింది. కొన్ని రోజులు సమయంతో షూటింగ్‌ను పూర్తి చేస్తామ‌న్నారు శేఖ‌ర్ క‌మ్ముల‌. అలాగే తాను పూర్తి బౌండెడ్ స్క్రిప్ట్‌తోనే సినిమా సెట్స్‌పైకి వెళ‌తాన‌ని కూడా అన్నారు. బ‌డ్జెట్ విష‌యంలో తాను ప‌క్క‌కు పోన‌ని, ముందుగానే నిర్మాత‌కు సూచించిన దాంట్లోనే సినిమాను పూర్తి చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తాన‌ని శేఖ‌ర్ క‌మ్ముల తెలిపారు. అలాగే ఈ సినిమాలో కొన్ని స‌న్నివేశాల‌ను రీ షూట్ చేశారంటూ వ‌చ్చిన వార్త‌ల‌ను ఆయ‌న తోసిపుచ్చారు. ఈ సినిమా త‌ర్వాత శేఖ‌ర్ క‌మ్ముల ఓ థ్రిల్ల‌ర్ మూవీని చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

More News

జాగ్రత్తగా షూటింగ్స్ చేసుకుంటాం.. పర్మిషన్ ఇవ్వండి : చిరు

మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో టాలీవుడ్ దర్శకనిర్మాతలు, సీనియర్ హీరోలు భేటీ అయ్యిన విషయం తెలిసిందే.

సాయంత్రంకల్లా టాలీవుడ్ షూటింగ్స్‌కు గ్రీన్ సిగ్నల్ !

మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో టాలీవుడ్ దర్శకనిర్మాతలు, సీనియర్ హీరోలు భేటీ అయ్యారు. సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఆధ్వర్యంలో

బెల్లంకొండతో సుధీర్ వర్మ?

స్వామిరారా, కేశ‌వ వంటి థ్రిల్ల‌ర్ చిత్రాల‌తో విజ‌యాల‌ను అందుకున్న ద‌ర్శ‌కుడు సుధీర్ వ‌ర్మ‌.

రెండు తెలుగు సినిమాల్లో హాసిని!!

బాలీవుడ్ భామ జెనీలియా తెలుగు, త‌మిళ‌, హిందీ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించి హీరోయిన్‌గా త‌న‌కంటూ ఓ గుర్తింపును సంపాదించుకుంది.

ఒక్కరోజే తమిళనాడులో 743.. మహారాష్ట్రలో 2,250 కరోనా కేసులు

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాల్లో రోజురోజుకు విజృంభిస్తోంది.