'అనగనగా ఓ ప్రేమకథ '  పాట ను విడుదల చేసిన శేఖర్ కమ్ముల

  • IndiaGlitz, [Thursday,October 04 2018]

విరాజ్.జె .అశ్విన్ హీరో గా పరిచయం అవుతూ 'అనగనగా ఓ ప్రేమకథ' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి విదితమే. కె.సతీష్ కుమార్ సమర్పణలో టి.ప్రతాప్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నాయికలుగా రిద్ధి కుమార్ ,రాధా బంగారు నటిస్తున్నారు. సినిమా రంగంలో ప్రముఖ ఫైనాన్షియర్ గా పేరుపొందిన నిర్మాత కె.ఎల్.యన్.రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ సాంగ్ ను ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..' చిత్రం లోని టైటిల్ సాంగ్ ను విడుదల చేయటం ఎంతో ఆనందంగా ఉంది. పాట కు సమకూర్చిన సంగీతం, సాహిత్యం ఎంతో బాగుంది. మార్తండ్ కే వెంకటేష్ గారి మేనల్లుడు అయిన విరాజ్ అశ్విన్ హీరో గా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు, మార్తండ్ కే వెంకటేష్ గారి తో నేను చాల సినిమాలు పని చేశాను , తప్పకుండా విరాజ్ అశ్విన్ మంచి హీరో అవుతాడు అని నమ్మకం ఉంది . డైరెక్టర్ ప్రతాప్ కి బెస్ట్ విషెస్ చెపుతూ , ఈ సినిమా ని హిట్ ఇవ్వాలి అని కోరుకుంటున్న అని మాట్లాడారు .

తమ చిత్రంలోని పాటను ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల విడుదల చేయటం పట్ల చిత్ర నిర్మాత సంతోషాన్ని వ్యక్తం చేసి కృతఙ్ఞతలు తెలిపారు. షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొన్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపు కుంటోంది. అక్టోబర్ నెలలో విడుదల చేయటానికి సిద్ధం చేస్తున్నాము అని తెలిపారు.

ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో కాశీవిశ్వనాధ్, అనీష్ కురువిళ్ళ, వేణు (తిళ్ళు) తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: కె.సి.అంజన్, పాటలు:శ్రీమణి, కెమెరా: ఎదురొలు రాజు, ఎడిటర్: మార్తాండ్.కె.వెంకటేష్, ఆర్ట్: రామాంజనేయులు, నృత్యాలు: అనీష్, పోరాటాలు:రామకృష్ణ నిర్మాత: కె.ఎల్.ఎన్.రాజు కధ,స్క్రీన్ ప్లే, మాటలు,దర్శకత్వం: ప్రతాప్ తాతంశెట్టి

More News

ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో రియ‌ల్ డిప్యూటీ స్పీక‌ర్‌...?

స్వ‌ర్గీయ మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ బ‌యోపిక్ టైటిల్ య‌న్‌.టి.ఆర్‌ను రీసెంట్‌గా 'య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు'గా మార్చారు.

'య‌న్‌.టి.ఆర్' టైటిల్ మారింది...

స్వ‌ర్గీయ ఎన్టీఆర్ జీవిత క‌థ‌ను 'య‌న్‌.టి.ఆర్‌' బయోపిక్‌గా .. రెండు భాగాలుగా తెరెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే.

త‌మిళంలోకి వ‌ర్మ సినిమా...

వివాద‌స్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ నిర్మాణంలో రూపొందుతోన్న చిత్రం 'భైర‌వ గీత‌'.  రాయ‌ల సీమ నేప‌థ్యంలో సాగే ఎమోష‌న‌ల్ రా ల‌వ్‌స్టోరీగా సినిమా రూపొందుతుంది.

విప్ల‌వ నాయ‌కుడి పాత్ర‌లో...

త‌మిళుల హ‌క్కుల కోసం ప‌రాయి దేశ‌మైనా శ్రీలంక‌లో పోరాడిన వ్య‌క్తి వేలు పిళ్లై ప్ర‌భాక‌రన్‌. ఎల్‌.టి.ఇ.ఇ అనే అతివాద సంస్థ‌ను స్థాపించి కొంద‌రు రాజ‌కీయ నాయ‌కుల‌ను కూడా హ‌త‌మార్చారు.

క‌మ‌ల్ హాస‌న్ త‌ర్వాత ..

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్ త‌ర్వాత రైజింగ్ స్టార్ విజ‌య్ దేవ‌ర కొండ అంట‌నే ఇష్టమంటున్న క‌న్న‌డ సూప‌ర్ స్టార్ శివ‌రాజ్ కుమార్‌.