అదే రిపీట్ చేస్తున్న శేఖ‌ర్ క‌మ్ముల‌

తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో శేఖ‌ర్ క‌మ్ములకు సెన్సిబుల్ డైరెక్ట‌ర్ అనే పేరుంది. అంతే కాదు.. త్వ‌ర‌త్వ‌ర‌గా సినిమాలు చేసేయాల‌ని కాకుండా చాలా కూల్‌గా సినిమాలు చేసుకుంటారు. అనుకున్న ఔట్‌పుట్ రాక‌పోతే రీ షూట్స్ చేస్తుంటాడు. 'ఫిదా' వంటి సూప‌ర్‌డూప‌ర్ హిట్ త‌ర్వాత ఈ డైరెక్ట‌ర్ ఇప్ప‌టి వ‌ర‌కు త‌న త‌దుప‌రి సినిమాను సిద్ధం చేయలేదంటే ప‌రిస్థితి అర్థం చేసుకోవ‌చ్చు. ప్ర‌స్తుతం శేఖ‌ర్ క‌మ్ముల నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వితో ల‌వ్‌స్టోరి సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. కోవిడ్ లేక‌పోయుంటే సినిమా ఇప్ప‌టికే విడుద‌ల కావాల్సింది. కానీ షూటింగ్స్ ఆగిన త‌ర్వాత ఇప్పుడు మ‌ళ్లీ రీస్టార్ట్ అవుతున్నాయి.

ఈ క్ర‌మంలో శేఖ‌ర్ క‌మ్ముల త‌న ఔట్‌పుట్ చూసుకున్న త‌ర్వాత హ్యాపీగా ఫీల్ కాలేద‌ట‌. దీంతో రీషూట్స్‌కు సిద్ధ‌మ‌య్యాడ‌ట‌. చైత‌న్య‌,సాయిప‌ల్ల‌వి కూడా రీషూట్స్‌కు డేట్స్ అడ్జ‌స్ట్ చేశార‌ట‌. ప‌రిస్థితి చూసిన వారు ఫిదా స‌మ‌యంలో జ‌రిగిన‌దే ఇప్పుడు రిపీట్ అవుతుంద‌ని అంటున్నారు. ఫిదా స‌మ‌యంలో రీషూట్స్ చేసిన శేఖ‌ర్, ఇప్పుడు ల‌వ్‌స్టోరి విష‌యంలోనూ అదే చేస్తున్నాడంటున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా రిలీజ్ విష‌యంలో ఓ క్లారిటీ రానుంద‌ని స‌మాచారం.

More News

జోనర్‌ విషయంలో క్లారిటీ ఇచ్చిన 'ఆర్‌ఆర్‌ఆర్‌' టీమ్‌

దర్శకుధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న భారీ చిత్రం ‘రౌద్రం రణం రుధిరం(ఆర్ఆర్ఆర్)‌’.

'ఎక్స్‌పైరీ డేట్‌'కి వస్తున్న స్పందన అమితానందాన్ని ఇచ్చింది! - దర్శకుడు శంకర్ కె. మార్తాండ్

తెలుగు సహా హిందీలోనూ వీక్షకాదరణ, ప్రశంసలు అందుకుంటున్న లేటెస్ట్ వెబ్ సిరీస్ 'ఎక్స్‌పైరీ డేట్‌'. జీ 5లో ఎక్స్ క్లూజివ్ గా విడుదలైన సిరీస్‌కి దర్శకత్వం వహించినది తెలుగు దర్శకుడు శంకర్ కె. మార్తాండ్

తెలంగాణకు చెందిన ట్రంప్ వీరాభిమాని గుండెపోటుతో మృతి

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వీరాభిమాని గుండెపోటుతో మృతి చెందాడు. అయితే ఆ వీరాభిమాని ఎక్కడి వాడో కాదు..

హీరోయిన్ అనిత తల్లి కాబోతోంది..

‘నువ్వు నేను’ హీరోయిన్ అనిత తల్లి కాబోతోంది. గతంలో అనిత తల్లికాబోతోందంటూ ఎన్నో సార్లు వార్తలొచ్చాయి.

ఫ్రస్టేషన్.. చిరాకు, కోపం వచ్చేవి: రాశి ఖన్నా

సక్సెస్‌తో సంబంధం లేకుండా రాణించిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే.. అది రాశీఖన్నాయేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.