close
Choose your channels

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై సీనియర్ నటి ఫైర్!

Tuesday, February 25, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

దేశ రాజధానిలో మళ్లీ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. సీఏఏ వ్యతిరేక నిరసనలతో ఢిల్లీలో హింసాత్మకంగా మారింది. ఇటీవల జరిగిన ఘటనలో ఓ హెడ్ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అయితే ఈ ఘటనపై కేంద్ర హోం మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటనల వెనుక ఎవరున్నారో కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని ప్రశ్నల వర్షం కురిపించారు. అంతేకాదు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌లో పర్యటస్తుండగా ఇలాంటి దాడులు జరగడం.. భారత్ ప్రతిష్టను దెబ్బతీసేందుకేనని ఆయన విమర్శలు గుప్పించారు. పోలీసులపై రాళ్లు విసిరి శాంతి భద్రతల సమస్య సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని కేంద్ర మంత్రి మండిపడ్డారు.

ప్లీజ్ ఈ మనిషికి చెప్పండి!
అయితే ఈ వ్యవహారంపై తాజాగా సీనియర్ నటి, కాంగ్రెస్ మహిళా నేత కుష్బూ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘ ప్లీజ్.. ఎవరైనా ఈ మనిషికి చెప్పండి.. ఆ ఘటనల వెనుక ఉన్నది అమిత్ షా, నరేంద్ర మోదీ తప్ప ఇంకెవరు? ఈ విషయం అందరికీ తెలుసు’ అని కుష్బూ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసలేం జరిగింది!?
కాగా.. ఈశాన్య దిల్లీలోని జఫ్రాబాద్‌, మౌజ్‌పుర్‌, గోలక్‌పురి భజన్‌పురలో సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాలు రాళ్లు రువ్వుకున్న సంగతి తెలిసిందే. ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయువును ప్రయోగించారు. ఈ క్రమంలో స్వల్ప లాఠీఛార్జీ కూడా చేశారు. ఈ ఘటనలో పలు వాహనాలు, దుకాణాలు, ఇళ్లకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.