Jamuna : మూడేళ్ల పాటు నిషేధం.. ధైర్యంగా నిలబడ్డ జమున, నాగిరెడ్డి-చక్రపాణి జోక్యంతో రాజీ

  • IndiaGlitz, [Friday,January 27 2023]

ఇప్పుడంటే చిత్ర పరిశ్రమలో ఇష్టారాజ్యంగా తయారైంది కానీ ఒకప్పుడు షూటింగ్‌కు నటీనటులంతా షూటింగ్‌కు దర్శక నిర్మాతలు చెప్పిన టైమ్‌కి వచ్చేసేవారు. మహానటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వీఆర్ , కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజులతో పాటు ఆ తరంలోని నటులంతా ఉదయాన్నే మేకప్ వేసుకుని ఇంటి దగ్గర రెడీగా వుండేవారు. కారు రావడం వారిని షూటింగ్ స్పాట్‌కి తీసుకెళ్లడం జరిగిపోయేవి. నిమిషం ఆలస్యమైనా ఆ రోజుల్లో దర్శకులు ఒప్పుకునేవారు కాదు. అంతటి క్రమశిక్షణతో వుండేవారు కాబట్టే వారంతా మహానటులు అయ్యారు, ఆ కాలం తెలుగు సినీ స్వర్ణ యుగమైంది.

జమున కాల్షీట్ల కోసం పడిగాపులు :

ఇదిలావుండగా.. ఆ తరానికి ప్రతినిధిగా వున్న సీనియర్ నటి జమున ఈరోజు కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీంతో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. తిరిగిరాని లోకాలకు తెలుగింటి సత్యభామ తరలిపోవడంతో సినీ ప్రముఖులు, అభిమానులు ఆమెకు సంతాపం తెలియజేస్తున్నారు. పొగరు వగరు కలబోసిన అందం జమున సొంతం. దాదాపు మూడు దశాబ్ధాల పాటు తెలుగు తెరను ఆమె మకుటం లేని మహరాణిలా ఏలారు. జమున కాల్షీట్ల కోసం దర్శక నిర్మాతలు ఎదురుచూసేవారంటే ఆమె స్థాయి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. జముననే నమ్ముకుని ఎంతోమంది సినిమాలు చేసుకుని ఆర్ధికంగా నిలదొక్కుకున్నారు.

జమునపై మూడేళ్ల పాటు బ్యాన్ :

అయితే జమున ఒకటి రెండు సార్లు షూటింగ్‌కు ఆలస్యం రావడంతో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తదితర నటులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పట్లో ఇండస్ట్రీ అంతా ఒక్కటై ఆమెను మూడేళ్ల పాటు తెలుగు సినిమాల్లో నటించకుండా నిషేధం విధించారట. అయినప్పటికీ జమున ధైర్యంగానే నిలబడ్డారు. తెలుగు చిత్ర సీమలో తనకు అవకాశాలు రాకపోవడంతో మిగిలిన పరిశ్రమలు .. ముఖ్యంగా హిందీలో సినిమాలు చేసి విజయాలు అందుకున్నారట. అటు మిగిలిన భాషల్లోనూ జమునకు తిరుగులేని ఆదరణ లభించింది. అయితే ప్రతిభ గల నటిని తెలుగు చిత్ర పరిశ్రమ కోల్పోకూడదన్న ఉద్దేశంలో అప్పటి సినీ పెద్దలైన నాగిరెడ్డి, చక్రపాణి తదితరులు ఆమె విషయంలో రాజీ కుదిర్చారట. దీంతో వివాదం సద్దుమణిగి జమున మళ్లీ తెలుగు సినిమాలు చేశారు.

More News

VK Naresh: ఆస్తి ఇవ్వలేదని నన్ను చంపేందుకు సుపారీ, రఘువీరా రెడ్డితోనూ బెదిరింపులు.. రమ్యపై నరేష్ సంచలన ఆరోపణలు

చిత్ర పరిశ్రమలో సీనియర్ హీరో నరేశ్, పవిత్రా లోకేష్‌ల వ్యవహారం ఎంతటి కలకలం రేపిందో తెలిసిందే.

Jamuna :సత్యభామ పాత్రకు జీవం పోశారు.. జమునకు చిరు, బాలయ్య, పవన్ సంతాపం

అలనాటి నటి, తెలుగు వారి సత్యభామ జమున కన్నుమూయడంతో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది.

Jamuna : టాలీవుడ్‌లో మరో విషాదం.. అలనాటి నటి జమున కన్నుమూత

గతేడాది కృష్ణంరాజు, కృష్ణ, కైకాల సత్యనారాయణ వంటి దిగ్గజాలను కోల్పోయి శోకసంద్రంలో మునగిపోయిన తెలుగు చిత్ర పరిశ్రమకు కొత్త ఏడాదిలో మరో షాక్ తగిలింది.

Pawan Kalyan:మళ్లీ ఏపీ విభజన అంటే  నా అంత ఉగ్రవాది ఉండడు.. తోలు తీస్తా : పవన్ సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదే‌లోని వైసీపీ ప్రభుత్వంపై మరోసారి మండిపడ్డారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో

Padma Awards 2023 : సంగీత దర్శకుడు కీరవాణికి పద్మశ్రీ

రిపబ్లిక్ డేను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. మొత్తం 106 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది.