సీనియర్‌ జర్నలిస్ట్‌, మ్యూజికాలజిస్ట్ రాజా ఇక లేరు

  • IndiaGlitz, [Thursday,April 15 2021]

‘హాసం’ రాజాగా సుపరిచితులైన సీనియర్‌ జర్నలిస్ట్‌, మ్యూజికాలజిస్ట్ రాజా(70) ఇక లేరు. గురువారం ఆయన హైదరాబాద్‌లో కన్ను మూశారు. రాజా అసలు పేరు మంగు నరసింహ స్వామి. బీకామ్‌ చదివిన రాజా.. 1974లో ‘వెండితెర’ సినీ వారపత్రికలో జర్నలిస్టుగా తన కెరీర్‌‌ను ప్రారంభించారు. ఆ తర్వాత ‘సినీ హెరాల్డ్‌’ వార పత్రికలో చేరారు. ఈ పత్రిక ద్వారా ఎందరో సినీ ప్రముఖులను ఇంటర్వ్యూ చేశారు. అలాగే ‘సినీ స్వరాలు’ పేరుతో ఆయన నిర్వహించిన శీర్షిక సినీ సంగీత ప్రపంచానికి దగ్గర చేసింది. అలాగే ‘సితార’ సినీ వారపత్రికలో రాజా నిర్వహించిన ‘సితారాగాలు’, ‘కూనిరాగాలు’ శీర్షికలు ఆయనకు ఎంతో పేరు తెచ్చాయి.

‘పల్లకి’ అనే వారపత్రికలో పని చేస్తున్న సమయంలోనే రాజా రాసిన ‘మల్లాది వెంకట కృష్ణమూర్తి’ సీరియల్‌ తెలుగు సాహిత్యంలో ఓ కొత్త ప్రయోగంగా గుర్తింపు తెచ్చుకొంది. ‘పల్లకి’ తర్వాత ‘ఆంధ్రభూమి’, ‘సితార’, ‘జ్యోతిచిత్ర’ సినిమా పత్రికల్లో ‘ఈ పాట ఇలా పుట్టింది’ అనే శీర్షికను రాజా నిర్వహించారు. అలాగే ఓ దినపత్రికలో ‘ఆ పాత మధురం’ పేరుతో ఆయన నిర్వహించిన శీర్షిక ఎంతో పేరు తెచ్చింది. అలాగే ‘హాసం’ హాస్య సంగీత పక్ష పత్రికకు ఎడిటర్‌గా చాలా కాలం పనిచేయడంతో ఆయన ‘హాసం’ రాజాగా పేరు గడించారు. మ్యూజికాలజిస్టుగా సినిమా పాటలను విశ్లేషించడంలో రాజా తన ప్రత్యేకతను చూపేవారు. అంతేకాకుండా ఆ పాటల తమిళ, హిందీ, కన్నడ, బెంగాలీ, ఆంగ్ల పాటల మూలాలను వెలికితీసి ఆ వివరాలను పాఠకులకు అందించేవారు.

‘హాసం’ పత్రిక మూసేసిన అనంతరం ‘మా టీవీ’లో రాజా పదేళ్లపాటు పనిచేశారు. అక్కడ సినీ ప్రముఖులతో చేసిన ‘గుర్తుకొస్తున్నాయి’ అనే కార్యక్రమం ఆయనకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. సినీ సంగీతానికి తను చేసిన పరిశోధనలకుగానూ గౌరవ డాక్టరేట్‌‌ను రాజా పొందారు. తెలుగు సినిమా పాటలు, వాటి రాగాలపై ‘ఆ పాత మధురం’ అనే పుస్తకాన్ని కూడా రాశారు. తెలుగు సినిమా పాటకు సంబంధించి సినీ ప్రముఖుల్లో ఎవరికి ఎలాంటి సందేహం కలిగినా వెంటనే రాజాను సంప్రదించేవారు. తెలుగు సినిమా పాటలకు సంబంధించిన పూర్తి వివరాలు అందరికీ అందుబాటులో ఉండాలనే ఆలోచనతో ‘రాజా మ్యూజిక్‌ బ్యాంక్‌’ ఏర్పాటు చేసి, దాదాపు 40 వేల పాటలు సేకరించారు. రాజా మృతి పట్ల సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

More News

విశాఖలో నరమేధం.. ఆరుగురి దారుణ హత్య

విశాఖలో ఒకే రోజు పది మంది అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మధురవాడలో ఓ కుటుంబం సజీవ దహనమైతే..

విశాఖలో ఎన్ఆర్ఐ కుటుంబం సజీవ దహనం..

ఫైనాన్షియల్‌గానే కాదు.. అన్ని విధాలుగా బాగుందనుకున్న ఎన్ఆర్ఐ కుటుంబం ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది.

దిగ్గజ దర్శకుడి శంకర్‌కి షాక్..

దిగ్గజ దర్శకుడు శంకర్‌కి కాలం కలిసొస్తున్నట్టుగా లేదు. ఒక సినిమా మధ్యలోనే ఆగిపోతే.. మరో సినిమా పట్టాలెక్కకుండానే అటకెక్కేలా ఉంది.

ఏఎంబీ సినిమాస్‌కు అంతర్జాతీయ గుర్తింపు

సూపర్ స్టార్ మహేష్ బాబు అటు సినిమాల్లో స్టార్ హీరోగా రాణిస్తూనే.. ఇటు వ్యాపారం రంగం వైపు కూడా అడుగులు వేస్తున్నారు

'నార‌ప్ప' చిత్రం నుండి ఫ్యామిలి పోస్ట‌ర్ విడుద‌ల‌

విక్టరి ఇంటి పేరుగా చేసుకున్న వెంకటేష్ హీరోగా,మనసుకు హత్తుకునే ఆహ్లాదకరమైన చిత్రాలు చేసే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో