ఔటర్‌పై రోడ్డు ప్రమాదం.. కారుతో బైక్‌ని ఢీకొట్టిన సీరియల్ నటి లహరి, అరెస్ట్

  • IndiaGlitz, [Wednesday,December 08 2021]

ఇటీవలి కాలంలో సినీ తారలు, బుల్లితెర సెలబ్రెటీలు యాక్సిడెంట్ కేసుల్లో ఇరుక్కుని వార్తల్లోకెక్కుతున్నారు. తాజాగా తెలుగు బుల్లితెరపై ఎన్నో సీరియల్స్‌లో నటించి.. కొన్ని సినిమాల్లోనూ అలరించిన లహరి ఓ యాక్సిడెంట్ చేశారు. వివరాల్లోకి వెళ్లితే.. నిన్న రాత్రి హైదరాబాద్ శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రైవేటు పెట్రోలింగ్ వాహనం నడిపే వ్యక్తి తన విధులు ముగించుకుని శంషాబాద్ వైపు వస్తున్నాడు. లహరి సైతం షూటింగ్ ముగించుకుని కారును తనే డ్రైవ్ చేస్తూ ఇంటికి బయల్దేరారు.

ఈ నేపథ్యంలో అతని బైక్‌ను తప్పించబోయి లహరి కారు ఢీ కొట్టింది. దీంతో బైక్‌ను నడుపుతున్న వ్యక్తి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతనిని స్థానికులు వెంటనే అక్కడికి దగ్గర్లోని హాస్పిటల్‌కు తరలించారు. అయితే ప్రమాదం జరిగినా లహరి కారులోంచి బయటకు దిగలేదు. దీంతో వాహనదారులు, స్థానికులు ఆమెపై మండిపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కారుతో పాటు లహరి‌ని పోలీస్టేషన్‌కు తరలించారు. అయితే ఇక ఈ ఘటనపై బాధితులు ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది. అలాగే లహరి మద్యం సేవించిందా లేదా అని తెలుసుకునేందుకు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్షలు కూడా చేశారు. కాగా, లహరి ప్రస్తుతం గృహలక్ష్మీ సిరియల్‌లో నటిస్తోంది.

More News

ఓటీటీలో రిలీజ్ కానున్న నాగచైతన్య ‘‘థ్యాంక్యూ’’.. ?

కరోనా వైరస్ పుణ్యామా అని ఓటీటీ మార్కెట్ బాగా అభివృద్ధి చెందుతోంది. థియేటర్లు మూతపడటం,

పుష్ప క్రూ మెంబర్స్‌కి బన్నీ సర్‌ప్రైజ్.. గోల్డ్ రింగ్స్‌ గిఫ్ట్‌గా ఇచ్చిన ఐకాన్ స్టార్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘‘పుష్ప’’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ప్రతి అన్న,చెల్లెలు తప్పక చూడవలసిన చిత్రం #BRO.. #BRO మూవీ గ్రాండ్ సక్సెస్ సెలబ్రేషన్స్

JJR ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై నవీన్ చంద్ర ,అవికా గోర్, సాయి రోనక్, దేవి ప్రసాద్, ప్రమోదిని, శ్రీ లక్ష్మీ, శ్రీనివాస్ , నటీనటులు గా

పెద్ద మనసు చాటుకున్న ప్రభాస్.. ఏపీ వరద బాధితులకు రూ.కోటి విరాళం, అభిమానుల ప్రశంసలు

భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవడానికి చిత్ర పరిశ్రమ నడుం బిగించింది.

బిగ్‌బాస్ 5 తెలుగు: సిరి- సన్నీల మధ్య లింక్.. తట్టుకోలేకపోయిన షన్నూ, టాప్ 6లో ఎవరెవరంటే..?

బిగ్‌బాస్ 5 తెలుగు 14వ వారానికి చేరుకుంది. దీంతో తెలుగు నాట విన్నర్ ఎవరంటూ డిస్కషన్ షురూ అయ్యింది.