బాలయ్య కోసం సెట్ వేస్తారా..

  • IndiaGlitz, [Sunday,July 09 2017]

నందమూరి బాలకృష్ణ 102వ చిత్రం ఆగస్టు 2న లాంఛనంగా ప్రారంభమవుతుందని వార్తలు వచ్చాయి. కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకుడు. సి.కళ్యాణ్‌ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరగుతున్నాయి. బాలకృష్ణ సరసన నయనతార హీరోయిన్‌గా నటించనుంది. సినిమా కథలో భాగంగా కొన్ని సన్నివేశాలను కోయంబత్తూరుకు దగ్గరలోని కుంభకోణంలో చిత్రీకరించాల్సి ఉందట.
లోకేషన్స్‌ వేటలో ఉన్న యూనిట్‌ కుంభకోణం ప్రాంతాన్ని కూడా చూసి వచ్చారు. అయితే కుంభకోణం తరహాలో చెన్నైలో సెట్‌ వేయాలా లేక, కుంభకోణంలోనే షూటింగ్‌ చేయాలా అని తర్జన భర్జన పడుతున్నారు. త్వరలోనే దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుతం బాలకృష్ణ 'పైసావసూల్‌' చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 29న దసరా సందర్భంగా విడుదల చేస్తున్నారు.

More News

రమ్యకృష్ణ కొత్త అవతారం...

'బాహుబలి' చిత్రంలో శివగామి అనే పవర్ ఫుల్ పాత్రలో మెప్పించింది రమ్యకృష్ణ.

రకుల్ గడుసుతనం

సినిమా ఇండస్ట్రీలో హీరోల కెరీర్ ఎక్కువ సంవత్సరాలు వుంటుంది.

హీరో నవీన్ చంద్ర చేతుల మీదుగా 'మిస్టర్ యోగి' ఫస్ట్ లుక్ విడుదల

జవాన్ అండ్ కాస్పియన్ ఇంటర్నేషనల్ పతాకంపై అజయ్ హీరోగా సుధాకర్ వినుకొండ దర్శకత్వంలో

అభిజిత్ హీరోగా '7 అడుగులు' సినిమా ప్రారంభం

తెలంగాణ ఎంపీ కవిత చేతుల మీదుగా టైటిల్ లోగో ని లాంఛ్ చేసుకున్న '7అడుగులు'చిత్రం..

అలా చేయడం తప్పేనంటున్న రాజమౌళి

బాహుబలి చిత్రంతో తెలుగు సినిమా స్థాయి అంతర్జాతీయ స్థాయికి పెరిగింది.