close
Choose your channels

హస్తినలో ఏపీ సర్కార్‌కు ఎదురుదెబ్బ!

Tuesday, June 25, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

హస్తినలో ఏపీ సర్కార్‌కు ఎదురుదెబ్బ!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి సోమవారం నాడు కాసింత శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. మంగళవారం నాడు మాత్రం ఊహించని షాకిచ్చింది. పోలవరం విషయంలో.. 2017-18 ధరలను పరిగణనలోకి తీసుకుని సవరించిన ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లకు కేంద్ర జలసంఘం పరిధిలోని సాంకేతిక సలహా సంఘం(టీఏసీ) ఆమోద ముద్ర వేసిన విషయం విదితమే. అయితే మంగళవారం సాయంత్రం సవరించిన అంచనాలపై ఫైనాన్స్‌ కమిటీ సమావేశమైంది. ప్రాజెక్టు నిర్మాణంలో ఇప్పటి దాకా పూర్తయిన పనులు, మిగిలిన పనులకి కావాల్సిన నిధులు, సాంకేతిక అంశాలపై చర్చ జరిగింది. టీఏసీలోని మెజారీటీ సభ్యులు ఈ ఫైనాన్స్‌ కమిటీలో సభ్యులుగా ఉండడంతో అంచనాలకు ఆమోదం తేలికగానే లభిస్తుందని రాష్ట్రం భావించించగా.. ఎదురుదెబ్బ తగిలింది.

ఊహించని ఎదురుదెబ్బ..!

సవరించిన పోలవరం ప్రాజక్టు అంచనాలను కేంద్రం అంగీకరించలేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన అంచనాలకు రివైజ్డ్ ఎస్టిమేట్స్ కమిటీ నో చెప్పింది. దీనిపై మరిన్ని వివరాలు ఇవ్వాలంటూ ఏపీ సర్కార్‌ను కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ కోరింది. పూర్తి వివరాలు వచ్చిన తర్వాత మరోసారి సమావేశం కావాలని కేంద్రం భావిస్తోంది. అయితే వివరాలు ఇచ్చిన తర్వాత అయినా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా..? లేకుంటే రెడ్ సిగ్నల్‌గానే మిగులుతుందా..? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.