కేసీఆర్ను కలిసిన శంకర్
- IndiaGlitz, [Wednesday,June 19 2019]
తెలంగాణ సీఎం కేసీఆర్ను దర్శకుడు ఎన్.శంకర్ కలిశారు. ముఖ్యమంత్రిని శాలువాతో సత్కరించారు. తనకు మోకిలలో ఐదు ఎకరాలు స్థలాన్ని కేటాయించినందుకుగానూ దర్శకుడు ఎన్.శంకర్ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోస్తూ ఎన్.శంకర్ అప్పట్లో జోబోలో తెలంగాణను తెరకెక్కించారు.
ఆ సినిమా ఉద్యమానికి ఊపిరిలూదింది. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సినిమాను ప్రోత్సహించడం కోసం స్టూడియో కట్టడానికి ఎన్.శంకర్కు ఐదెకరాలు స్థలాన్ని కేటాయిస్తున్నట్టు గతంలో తెలంగాణ ప్రభుత్వం జీవోను విడుదల చేసింది. ఇప్పుడు ఆ జీవో ప్రకారం మోకిలలో స్థలాన్ని కూడా కేటాయించింది. అందుకు కృతజ్ఞతలు తెలుపుతూ కేసీఆర్ను ఎన్.శంకర్ కలిశారు.