నిఖిల్ ' శంకరాభరణం ' సెన్సార్ పూర్తి డిసెంబర్ 4న విడుదల

  • IndiaGlitz, [Friday,November 13 2015]

స్వామి రారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య.. ఇలా వరుసగా వైవిధ్యభరితమైన చిత్రాలు చేస్తూ, ముందుకు దూసుకెళుతున్న నిఖిల్ నటించిన తాజా చిత్రం 'శంకరాభరణం'. నందిత కథానాయికగా నటించింది. ప్రముఖ రచయిత కోన వెంకట్ సమర్పణలో ఎం.వీ.వీ. సత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రానికి ఉదయ్ నందనవనమ్ దర్శకుడు. 'గీతాంజలి' వంటి విజయం తర్వాత ఎంవీవీ సినిమా సంస్థ నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.

ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. డిసెంబర్ 4న ఈ చిత్రం విడుదల కానుంది.
ఈ సందర్భంగా కోన వెంకట్ మాట్లాడుతూ - ''అన్ని పాటలకూ మంచి ఆదరణ లభిస్తోంది. హారర్ కి కామెడీ మిక్స్ చేసి, మేం తీసిన 'గీతాంజలి' ఘనవిజయం సాధించింది. ఇప్పడు క్రైమ్ లో కామెడీ మిక్స్ చేసి 'శంకరాభరణం' చేశాం. ఇంతకుముందు క్రైమ్ కామెడీ సినిమాలు చాలా వచ్చాయి కానీ ఇది చాలా డిఫరెంట్. ఈ సినిమాలో సెట్స్ ఉపయోగించలేదు. టాకీ మాత్రమే కాదు... చివరికి పాటలను కూడా సహజమైన లొకేషన్స్ లోనే తీశాం. బీహార్ లోని డేంజరస్ లొకేషన్స్ లో, పుణేకి దగ్గరలో ఎవరూ చేయని లొకేషన్స్ లో, యూఎస్ లో కొంత భాగం చిత్రీకరించాం.

కథ గురించి చెప్పాలంటే.. యూఎస్ కి చెందిన అత్యంత సంపన్నుడి కొడుకు హీరో నిఖిల్. ఈ ప్రపంచంలో సుఖపడేవాళ్లు, కష్టపడి పనిచేసేవాళ్లు.. ఈ రెండు జాతులే ఉంటాయన్నది హీరో నమ్మకం. తాను సుఖపడటానికే పుట్టానన్నది అతని ఫీలింగ్. అలాంటి అతను ఓ పని మీద ఇండియా వచ్చి, అనుకోకుండా కష్టాల్లో చిక్కుకుంటాడు. వాటి నుంచి ఎలా తప్పించుకున్నాడనే కథాంశంతో సినిమా సాగుతుంది. ఇందులో అంజలి స్పెషల్ క్యారెక్టర్ చేసింది. సుమన్, సితార, రావు రమేశ్, సప్తగిరి.. ఇలా మొత్తం 40 మంది ప్రముఖ నటీనటులు నటించారు. భారీ నిర్మాణ వ్యయంతో రూపొందించాం'' అని చెప్పారు.

నిర్మాత మాట్లాడుతూ- ''మా సంస్థ నుంచి వచ్చిన 'గీతాంజలి' ఘనవిజయం సాధించింది. మలి చిత్రం కూడా అలానే ఉండాలని తొమ్మిది నెలలు వెయిట్ చేసి, ఈ చిత్రకథను ఎంపిక చేశాం. కోన వెంకట్ మంచి కథ ఇచ్చారు. ఆ కథను దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు. కథ డిమాండ్ చేసిన మేరకు రాజీపడకుండా భారీ బడ్జెట్ తో నిర్మించాం. డిసెంబర్ 4న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం'' అని చెప్పారు.

More News

కొట్టుకునేంత స్టుపిడ్ ఫ్యామిలీ కాదు మాది - అఖిల్ సక్సెస్ మీట్ లో నాగ్

అక్కినేని వంశం నుంచి తెలుగు తెరకు పరిచయమైన మూడోతరం యువ కధానాయకుడు అఖిల్.సెన్సేషనల్ డైరెక్టర్ వినాయక్ దర్శకత్వంలో అఖిల్,సయేషా జంటగా నటించారు.

'ప‌టాస్' రీమేక్ అప్‌డేట్‌

తెలుగులో ఘ‌న‌విజ‌యం సాధించిన క‌ళ్యాణ్ రామ్ 'ప‌టాస్' మూవీ.. త‌మిళంలో రీమేక్‌గా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. లారెన్స్ రాఘ‌వ క‌థానాయ‌కుడుగా న‌టిస్తున్న ఈ చిత్రంలో నిక్కీ గ‌ల్‌రాణి హీరోయిన్‌గా న‌టిస్తోంది.

డ‌బుల్ ధ‌మాకా ఇవ్వ‌నున్న న‌య‌న‌తార‌

వ‌రుస‌గా మూడు నెల‌ల్లో మూడు సూప‌ర్ హిట్ సినిమాల‌ను త‌న ఖాతాలో వేసుకుంది కేర‌ళ‌కుట్టి న‌య‌న‌తార‌.

వైజాగ్ బీచ్ లో శంక‌రాభ‌ర‌ణం ట్రిఫుల్ ప్లాటినం

నిఖిల్, నందిత జంట‌గా న‌టిస్తున్న చిత్రం శంక‌రాభ‌ర‌ణం. ఈ చిత్రాన్ని నూత‌న ద‌ర్శ‌కుడు నంద‌న‌వ‌నం తెర‌కెక్కించారు.

నవంబర్‌ 14న 'శ్రీమంతుడు' సైకిల్‌ విజేతను ఎంపిక చేయనున్న సూపర్‌స్టార్‌ మహేష్‌

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా మైత్రి మూవీ మేకర్స్‌, ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి. పతాకాలపై కొరటాల శివ దర్శకత్వంలో నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌, సి.వి.మోహన్‌ (సివిఎం) సూపర్‌ డూపర్‌ హిట్‌ మూవీ 'శ్రీమంతుడు'.