దశరథ్ దర్శకత్వంలో శర్వానంద్...

  • IndiaGlitz, [Tuesday,May 02 2017]

సంతోషం, మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ వంటి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్స్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన ద‌ర్శ‌కుడు ద‌శ‌ర‌థ్‌. శౌర్యం సినిమా ప్లాప్ త‌ర్వాత ద‌శ‌ర‌థ్ మ‌రే సినిమా చేయలేదు. మంచి స్క్రిప్ట్‌ను త‌యారుచేసుకున్నాడు. ఇప్పుడు ఈ స్క్రిప్ట్‌తో శ‌ర్వానంద్ హీరోగా సినిమా చేయ‌బోతున్నాడ‌ట‌.

వ‌రుస విజ‌యాల‌ను అందుకుంటున్న శ‌ర్వానంద్ ఇప్పుడు మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. చంద్ర‌మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రాధగా ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌నున్నాడు. ఈ కొత్త‌చిత్రం జూలై ద్వితీయార్థంలో ప్రారంభం కానుంద‌ట‌. ఠాగూర్ మ‌ధు ఈ చిత్రాన్ని నిర్మిస్తాడ‌ని స‌మాచారం.

More News

చైతు సినిమా రిలీజ్ వాయిదా పడుతుందా..?

అక్కినేని నాగచైతన్య హీరోగా సోగ్గాడే చిన్ని నాయనా ఫేమ్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ `రారండోయ్ వేడుక చూద్దాం`. ఈ సినిమాను మే 19న విడుదల చేయాలనుకుంటున్నట్లు దర్శకుడు అక్కినేని నాగార్జున తెలియజేశారు

యు.ఎస్. బాక్సాఫీస్ వద్ద మూడోస్థానంలో 'బాహుబలి -2'

ప్రభాస్, రాజమౌళి కాంబోలో రూపొందిన విజువల్ వండర్ బాహుబలి రెండో పార్ట్ `బాహుబలి-2` ఏప్రిల్ 28న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అవడమే కాదు, తెలుగు, తమిళం, హిందీ, మలయాళంలో కనువిని ఎరుగని రీతిలో కలెక్షన్స్ను సాధిస్తూ బాలీవుడ్ చిత్రాలకు ధీటుగా ముందుకు సాగిపోతుంది.

ఇంతకంటే ఇంకేం కావాలి - రాజమౌళి

రాజమౌళి ఇంతకంటే ఇంకేం కావాలి అన్నాడంటే ఎంతో ఆనందించదగ్గ విషయమే అయ్యుంటుంది. అదేంటంటే తలైవా, సూపర్స్టార్ రజనీకాంత్ అభినందనే కారణమట. బాహుబలి -2 సినిమాను చూసిన రజనీకాంత్ బాహుబలి సినిమా ఇండియన్ సినిమాకే గర్వకారణం.

పివి సింధు బయోపిక్...

గత ఏడాది ఓలింపిక్స్ లో భారతదేశానికి వెండి పతకాన్ని తెచ్చి పెట్టిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు బయోపిక్ రూపొందనుంది. ఈ బయోపిక్ను నటుడు, నిర్మాత అయిన సోనూసూద్ తెరకెక్కించనున్నాడు.

పూరి విగ్రహావిష్కరణ...

బ్రది సినిమాతో దర్శకుడిగా తెరంగేట్రం చేసిన పూరి జగన్నాథ్ మాస్ హీరోయిజాన్ని ప్రెజెంట్ చేయడంలో తన ప్రత్యేకతను ఎప్పుడూ చాటుకుంటూనే ఉంటారు. అందుకనే హీరోలందరూ పూరి దర్శకత్వంలో నటించాలని కోరుకుంటారు.