వెంకీ సినిమాలో శర్వానంద్..?

  • IndiaGlitz, [Tuesday,September 29 2020]

మన సినిమాల్లో ఒక హీరో చేయాల్సిన సినిమాను మ‌రో హీరో చేయ‌డం కామ‌న్‌గా క‌నిపించే విష‌య‌మే. ఇప్పుడు అలాగే ఓ స్టార్ హీరో చేయాల్సిన సినిమాలో ఓ యువ క‌థానాయ‌కుడు న‌టించ‌బోతున్నాడ‌ని వార్త‌లు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఆ స్టార్ హీరో వెంక‌టేశ్ కాగా.. యంగ్ హీరో శ‌ర్వానంద్. వివ‌రాల్లోకెళ్తే.. ఈ ఏడాది ‘జాను’ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు శ‌ర్వానంద్‌. షూటింగ్స్ విష‌యానికి వ‌స్తే ఈయ‌న ‘శ్రీకారం’ సినిమాను పూర్తి చేయాల్సి ఉంది. దీని త‌ర్వాత అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌బోతున్న ‘మ‌హాస‌ముద్రం’ సినిమాలో శ‌ర్వా న‌టించాల్సి ఉంది. దీంతో పాటు కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ఈ హీరో ఓకే చెప్పిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. కిషోర్ తిరుమ‌ల గ‌తంలో వెంక‌టేశ్‌తో ‘ఆడాళ్లు మీకు జోహార్లు’ సినిమా చేయ‌డానికి రెడీ అయ్యారు. అయితే కొన్ని కార‌ణాల‌తో ఆ ప్రాజెక్ట్ ఎందుక‌నో ట్రాక్ ఎక్క‌లేదు.

లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఇదే క‌థ‌తో కిషోర్ తిరుమ‌ల.. హీరో శ‌ర్వానంద్‌ను క‌లిశాడ‌ట‌. శ‌ర్వానంద్‌కు క‌థ బాగా న‌చ్చింద‌ట‌. అయితే అది ఫ‌స్టాఫ్ మాత్ర‌మే న‌చ్చింది. సెకండాఫ్‌లో కొన్ని మార్పులు, చేర్పులు చేసి మ‌ళ్లీ క‌థ వినిపించ‌మ‌ని కిషోర్ తిరుమ‌ల‌కు శ‌ర్వా చెప్పిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఈ ద‌ర్శ‌కుడు శ‌ర్వానంద్ చెప్పిన రీతిలో మార్పులు, చేర్పులు చేస్తున్నార‌ని అంటున్నారు. అయితే ఈ సినిమా 2021 ద్వితీయార్థంలోనే మొద‌ల‌య్యే అవ‌కాశాలున్నాయి.

More News

‘ఆచార్య’ కోసం చ‌ర‌ణ్ ఏం చేస్తున్నాడో తెలుసా?

గ‌త ఏడాది ‘సైరా న‌ర‌సింహారెడ్డి’తో మెగాభిమానుల‌ను అల‌రించాల‌ని అనుకున్న మెగాస్టార్ చిరంజీవికి అంత స్కోప్ లేకుండా పోయింది.

డ్రగ్స్ కేసులో మళ్లీ హీరోయిన్ల విచారణ.. హీరోల వంతూ వచ్చేసింది!

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో మరోసారి స్టార్ హీరోయిన్లను విచారించేందుకు ఎన్సీబీ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

సోనూసూద్‌కు ఐక్య‌రాజ్య‌స‌మితి అవార్డ్‌

సినిమాల్లో విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడైన బాలీవుడ్ న‌టుడు సోనూసూద్

నిశ్శ‌బ్ధం లో క‌థ‌లో ప్ర‌తి పాత్ర ఆస‌క్తిక‌రంగా ఉంటాయి - అనుష్క‌

భాగ‌మ‌తి త‌రువాత కావాల‌ని గ్యాప్ తీసుకున్నా, ఆ స‌మయంలో కోన‌వెంక‌ట్ గారు, హేమంత్ గారితో ఈ స్టోరీ నెరేష‌న్ ఇప్పించారు,

‘ఆదిపురుష్‌’... అనుష్క క్లారిటీ..!

ప్యాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్..బాహుబ‌లి త‌ర్వాత ప్యాన్ ఇండియా స్టార్‌గా ప్ర‌భాస్ వ‌రుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.