Sharwanand: శర్వానంద్‌‌‌కి యాక్సిడెంట్.. స్పందించిన శర్వా టీమ్

  • IndiaGlitz, [Sunday,May 28 2023]

టాలీవుడ్ యువ కథానాయకుడు శర్వానంద్‌కు తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న రేంజ్ రోవర్ కారు శనివారం అర్రాత్రి హైదరాబాద్ ఫిల్మ్ నగర్ ‌లోని ఓ జంక్షన్ వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. అయితే ఈ ఘటనలో శర్వానంద్ గాయపడ్డారని ఆసుపత్రికి తరలించారని మీడియాలో కథనాలు వచ్చాయి. దీనిపై శర్వానంద్ టీమ్ స్పందించింది. ఆయనతో పాటు కారులో వున్న వారెవరికి ఏం కాలేదని, అందరూ క్షేమంగానే వున్నారని..కారుకి చిన్న గీతల మాత్రం పడ్డాయని పేర్కొంది. దీంతో శర్వానంద్ అభిమానులు , సినీ ప్రముఖులు ఊపిరి పీల్చుకున్నారు.

జూన్ 3న రాజస్థాన్‌లో శర్వానంద్ వివాహం:

మరోవైపు .. శర్వానంద్ జూన్ 3న రక్షితారెడ్డిని వివాహం చేసుకోనున్న సంగతి తెలిసిందే. వీరి వివాహం రాజస్థాన్‌లో జరగనుంది. ఈ ఏడాది జనవరి 26న విరి నిశ్చితార్ధం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. అయితే ఎంగేజ్‌మెంట్ జరిగి చాలా కాలమే అయినా పెళ్లి తేదీ ప్రకటించకపోవడంతో మీడియాలో రకరకాల కథనాలు వచ్చాయి. దీంతో వీటికి చెక్ పెడుతూ తమ వివాహ తేదీని, వేదికను ప్రకటించారు శర్వానంద్ . జూన్ 3న రాజస్థాన్‌లోని లీలా ప్యాలెస్‌లో తమ వివాహం జరుగుతుందని తెలిపారు. ఇక జూన్ 2న మెహందీ ఫంక్షన్, అదే రోజు ఉదయం శర్వానంద్‌ను పెళ్లి కొడుకును చేస్తారు.

ఎవరీ రక్షితా రెడ్డి:

కాగా.. రక్షితారెడ్డి అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. వీరిది తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పొలిటికల్ ఫ్యామిలీ. రక్షిత తండ్రి ఏపీ హైకోర్ట్ న్యాయవాది కాగా.. ఆమె తాత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మాజీ మంత్రి, టీడీపీలో సీనియర్ నేత. ఇటీవలే ఆయన అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. శర్వానంద్ సినిమాల విషయానికి వస్తే.. ఆయన గతేడాది ఒకే ఒక జీవితం చిత్రంతో మంచి హిట్‌ను అందుకున్నారు. ప్రస్తుతం ఆయన శ్రీరామ్ ఆదిత్యతో ఓ సినిమా చేయనున్నారు.

More News

Telangana: తెలంగాణకు అలర్ట్ .. వచ్చే మూడు రోజుల్లో మండిపోనున్న ఎండలు

రోహిణి కార్తె ప్రవేశంతో తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 గంటలకే భానుడు మాడు పగుల గొడుతున్నాడు. అత్యవసర పనుల మీద బయటకు వెళ్లే వారు

Director Vasu: టాలీవుడ్‌లో మరో విషాదం.. దర్శకుడు కే.వాసు కన్నుమూత, మెగాస్టార్‌కు కోలుకోలేని షాక్

సంగీత దర్శకుడు రాజ్, సీనియర్ నటులు శరత్ బాబు మరణాల నుంచి కోలుకోకముందే టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ దర్శకుడు కే.వాసు కన్నుమూశారు.

చైనాలో మళ్లీ విజృంభిస్తోన్న కరోనా.. జూన్ చివరి నాటికి గరిష్ట స్థాయికి, వారానికి 6.5 కోట్ల కేసులు ..?

దాదాపు రెండున్నరేళ్ల పాటు మనిషిని నాలుగు గోడలకు పరిమితం చేసి అన్ని వ్యవస్థలను కకావికలం చేసింది కోవిడ్ రక్కసి. ఈ మహమ్మారి పీడ అంతం అయ్యిందని అనుకుంటుంటే

Dimple Hayathi: డీసీపీతో వివాదం.. హీరోయిన్ డింపుల్ ఇంట్లోకి చొరబడిన ఇద్దరు వ్యక్తులు, కుక్క తరమడంతో

డింపుల్ హయాతి..గత నాలుగు రోజులుగా వార్తల్లో నానుతోన్న పేరు. తన పని తాను కామ్‌గా చేసుకుంటూ వెళ్లే ఈ ముద్దుగుమ్మ ఇటీవల ఓ ఐపీఎస్‌తో వివాదం కారణంగా ఏకంగా పోలీస్..

Ram Charan:‘వి మెగా పిక్చ‌ర్స్’ బ్యాన‌ర్‌పై యంగ్ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేస్తోన్న గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌

ఆస్కార్ విన్నింగ్ మూవీ RRRతో  వ‌ర‌ల్డ్ వైప్ పాపులారిటీ ద‌క్కించుకున్నారు గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌.