close
Choose your channels

14 రీల్స్ ప్లస్ నిర్మాతలకు నోటీసులు.. శర్వానంద్ కోపానికి కారణం అదేనా?

Saturday, May 29, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

14 రీల్స్ ప్లస్ నిర్మాతలకు నోటీసులు.. శర్వానంద్ కోపానికి కారణం అదేనా?

యంగ్ హీరో శర్వానంద్ నటనా ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన ముఖకవళికలతోనే అన్ని భావాలని పలికించగల నటుడు శర్వానంద్. కమర్షియల్ సక్సెస్ విషయంలో శర్వానంద్ ఒక అడుగు వెనుకబడే ఉన్నప్పటికీ అతడి కెరీర్ డీసెంట్ గా నే సాగుతోంది.

ఈ ఏడాది శర్వానంద్ శ్రీకారం చిత్రంతో ప్రేక్షకులని పలకరించాడు. ఆ చిత్రం విషయంలో ఓ వివాదం రాజుకుంది అంటూ టాలీవుడ్ లో బలమైన ప్రచారం జరుగుతోంది. శ్రీకారం చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించారు. డెబ్యూ దర్శకుడు కిషోర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.

ఇదీ చదవండి: బోల్డ్ సీనా.. అయితే ముందే క్లారిటీ ఇవ్వాలి

సినిమాకి ముందుగా తన రెమ్యునరేషన్ 6 కోట్లుగా నిర్మాతలతో శర్వానంద్ కు ఒప్పందం జరిగింది. కానీ విడుదల తర్వాత ఇస్తామని చెప్పి నిర్మాతలు రూ. 2 కోట్లు పెండింగ్ పెట్టారట. సినిమా విడుదలై చాలా రోజులు గడుస్తోంది. శర్వానంద్ తన పెండింగ్ క్లియర్ చేయమని ఇప్పటికే చాలా సార్లు నిర్మాతలని రిక్వస్ట్ చేశారట. కానీ ప్రొడ్యూసర్స్ నుంచి స్పందన రాకపోవడంతో శర్వానంద్ ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది.

దీనితో శర్వా నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. దీనిపై నిర్మాతలు స్పందించాల్సి ఉంది. శర్వానంద్ ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండే నటుడు. దీనితో ఈ వివాదం చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది.

మార్చ్ 11న విడుదలైన శ్రీకారం చిత్రం మంచి టాక్ సొంతం చేసుకుంది. వ్యవసారం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రశంసలు కూడా దక్కాయి. కానీ వసూళ్ల పరంగా ఆశించిన సక్సెస్ అందుకోలేకపోయింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.