పడి పడి లేచేమనసు కలకత్తా షెడ్యూల్ పూర్తి!

  • IndiaGlitz, [Friday,July 13 2018]

హీరో శర్వానంద్, హీరోయిన్ సాయి పల్లవి జంటగా నటిస్తున్న 'పడి పడి లేచే మనసు' కలకత్తా షెడ్యూల్ పూర్తి చేసుకుంది.

ఈ చిత్ర షూటింగ్ కలకత్తాలో 70 రోజుల షూటింగ్ పూర్తి చేసుకున్న అనంతరం నేపాల్ లో కొంత భాగం షూటింగ్ జరుపుకోనుంది.

పడి పడి లేచేమనసు చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ... ముఖ్య తారాగణంపై కొన్ని కీలక సన్నివేశాలు కలకత్తా షెడ్యూల్ లో చిత్రీకరించాము. సినిమా బాగా వస్తోంది. డైరెక్టర్ హను రాగవపూడి మాంచి ప్రేమకథతో మీ ముందుకు వస్తున్నారు. శర్వానంద్, సాయి పల్లవి ఈ సినిమాలో చూడముచ్చటగా కనిపించబోతున్నారు.

మురళి శర్మ, సునీల్, వెన్నెల కిషోర్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు జయకృష్ణన్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నారు అన్నారు.

More News

లారెన్స్‌ను టార్గెట్ చేసిన శ్రీరెడ్డి..

కాస్టింగ్ కౌచ్ గురించి టాలీవుడ్‌లో దుమారం రేపిన శ్రీరెడ్డి.. ఈ మ‌ధ్య కొంత‌కాలం కామ్‌గా ఉన్న సంగ‌తి తెలిసిందే.

'పందెంకోడి 2' భారీ డీల్‌

13 ఏళ్ల త‌ర్వాత విశాల్..లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వంలో త‌న‌కు బ్రేక్ ఇచ్చిన సినిమా 'పందెం కోడి'(సండైకోళి)కి సీక్వెల్‌ను చేస్తున్నాడు.

రూమ‌ర్స్‌ పై ద‌ర్శ‌కుడి వివ‌ర‌ణ‌...

బ‌లుపు, డాన్‌శీను చిత్రాల‌తో స‌క్సెస్ కొట్టిన ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేని త‌దుప‌రి సాయిధ‌ర‌మ్‌తేజ్‌తో సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే.

హిందీ సినిమా గురించి నాగ్ ఏమ‌న్నాడంటే..

దాదాపు ప‌దిహేనేళ్ల త‌ర్వాత అక్కినేని నాగార్జున హిందీ సినిమా 'బ్ర‌హ్మాస్త్ర‌'లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. 2003క‌లో 'ఎల్‌.ఒ.సి కార్గిల్'  త‌ర్వాత నాగ్ న‌టిస్తున్న హిందీ చిత్ర‌మిది.

 'వీర భోగ వసంత రాయలు' ఫస్ట్ లుక్ రిలీజ్

నారా రోహిత్‌, శ్రీవిష్ణు, సుధీర్ బాబు, శ్రీయ కాంబినేష‌న్ లో రూపొందుతున్న మల్టీస్టారర్ చిత్రం వీర భోగ వసంత రాయలు. ఈ చిత్రాన్ని బాబా క్రియేష‌న్స్ ప‌తాకం