‘రైతు’ కానున్న ‘రణరంగం’ హీరో!

  • IndiaGlitz, [Saturday,August 24 2019]

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ విభిన్న పాత్రల్లో చేస్తుంటారన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా లవ్ స్టోరీ రిలేటెడ్ కథల్లో ఎక్కువగా నటిస్తుంటారు. ఇప్పటికే చేయాల్సిన అన్ని పాత్రల్లో చేసేసిన శర్వా ఈ సారి ‘రైతు’గా నటిస్తారని సమాచారం. శర్వా హీరోగా కిశోర్‌ రెడ్డి తెరెకెక్కిస్తున్న చిత్రం ‘శ్రీకారం’. ఈ చిత్రంలో కుర్ర హీరో రైతన్నగా కనిపించనున్నట్లు తెలుస్తోంది.

విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమా.. వ్యవసాయ ప్రథానాంశంగా సాగనున్నట్లు ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. త్వరలో హైదరాబాద్‌లో షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ చిత్రం షూటింగ్ ఎక్కువగా ‘తిరుపతి’, ‘అనంతపురం’లో ‘శ్రీకారం’ చుడతారని తెలుస్తోంది. అయితే ఈ సినిమాపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

ఇదిలా ఉంటే.. శర్వా-కాజల్ నటీనటలుగా వచ్చిన ‘రణరంగం’ ఆశించిన స్థాయిలో ఆడలేదన్న విషయం విదితమే. ప్రస్తుతం తమిళ రీమేక్ చిత్రం ‘96’లో బిజిబిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్వవ్వగానే శ్రీకారం షూటింగ్ షురూ కానుంది. ఇప్పటి వరకూ లవర్ బాయ్‌గా మంచి పేరు తెచ్చుకున్న శర్వా.. రైతన్నగా ఏ మాత్రం రాణిస్తారో వేచి చూడాల్సిందే.