ప్రారంభమైన 'శిఖండి' షూటింగ్

  • IndiaGlitz, [Friday,March 10 2017]

శ్రీ చర్ల మూవీస్ పతాకం పై చర్ల శ్రీనివాస్ యాదవ్ నిర్మిస్తోన్న చిత్రం “శిఖండి”. పి.రాజారెడ్డి ఈ సినిమాతో దర్శకునిగా తెలుగు చిత్ర సీమకు పరిచయం అవుతున్నారు. నూతన నటీనటులు భరత్, భింభిక నటిస్తోన్న ఈ సినిమా ఎమోషనల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా ప్రారంభోత్సవం పఠాన్ చెరువు టెంపుల్ పరిసర ప్రాంతాల్లో జరిగింది. ప్రముఖ నిర్మాత లయన్ వెంకట్ హీరోయిన్లకు క్లాప్ ఇచ్చి ముహర్తపు సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు.

ఇప్పటివరకు టాలీవుడ్ లో ఎవరు టచ్ చేయని సబ్జెక్ట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నామని దర్శనిర్మాతలు తెలిపారు. 30 రోజులకి పైగా ఈ సినిమా చిత్రీకరణ జరపడానికి చిత్ర బృందం ప్లాన్ చేసింది. హైదరాబాద్ లో టాకీ, కర్ణాటకలోని కూర్గ్, మహాబలేశ్వర్ తదితర లోకేషన్స్ లో సాంగ్స్ షూట్ చేసేందుకు ఈ మూవీ టీమ్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు డి.ఓ.పి – హరీశ్ ఎస్.ఎన్, ఎడిటింగ్ – ఆవుల వెంకటేశ్, సంగీతం – సంజీవ్ మెగోటి.

More News

డబ్బింగ్ మొదలుపెట్టిన 'ఏంజెల్'

బ్యూటీ క్వీన్ హెబ్బా పటేల్ టైటిల్ రోల్ లో తెరకెక్కుతోన్న సినిమా “ఏంజిల్”. యంగ్ హీరో నాగ అన్వేష్, ఓ ఛాలెజింగ్ పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రంతో దర్శకధీరుడు రాజమౌళి శిష్యుడు బాహుబలి పళని దర్శకుడిగా తెలుగు చిత్ర సీమకు పరిచయం అవుతున్నారు.

'పిచ్చిగా నచ్చావ్' ట్రైలర్ ఆవిష్కరణ

''ప్రేమన్నది యూనివర్సెల్. కానీ ప్రేమలో ఉన్న ప్రతి మనిషి తనదైన శైలిలో నిర్వచనం చెబుతుంటారు. అంటే ప్రేమ అన్నది వ్యక్తిగతం కూడా. చిన్న విషయాన్ని కూడా అర్ధం చేసుకోకుండా నేటి యువత కోపం, ఈర్ష్య, ద్వేషం పెంచుకుపోతున్నారు.

కిట్టుగాడి విజయ యాత్ర

వరుస విజయాలతో సక్సెస్ఫుల్ హీరోగా రాణిస్తున్న యువ కథానాయకుడు రాజ్ తరుణ్ హీరోగా, అను ఇమ్మాన్యుయల్ హీరోయిన్గా ఏటీవీ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై వంశీకృష్ణ దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర దర్శకత్వంలో రూపొందించిన హిలేరియస్ ఎంటర్టైనర్ `కిట్టు ఉన్నాడు జాగ్రత్త`.

జాహ్నవి ఫిలింస్ బ్యానర్ లో అల్లరి నరేష్ కొత్త చిత్రం

మలయాళం లో ఘన విజయం సాధించిన 'ఓరు వడక్కన్ సెల్ఫీ' చిత్రం అల్లరి నరేష్ హీరోగా తెలుగులో రీమేక్ కాబోతుంది. జాహ్నవి ఫిలింస్ బ్యానర్పై శ్రీమతి నీలిమ సమర్పణలో చంద్రశేఖర్ బొప్పన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. 'ఓరు వడక్కన్ సెల్ఫీ' మలయాళ మాతృక చిత్రాన్ని డైరెక్ట్ చేసిన జి. ప్రజీత్ ఈ రీమేక్కి దర్శకత్వం వహించనున్నారు.

రాజశేఖర్ కుమార్తెను పరిచయం చేయనున్న దర్శకుడు

చిత్రం, జయం, నువ్వు నేను వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు తేజ ఇప్పుడు రానా, కాజల్ హీరో హీరోయిన్లుగా ఓ పొలిటికల్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.