కోలీవుడ్‌లో ఛాన్స్ దక్కించుకున్న శివాత్మిక రాజశేఖర్

  • IndiaGlitz, [Friday,February 12 2021]

శివాత్మిక రాజశేఖర్.. ఆ మధ్య విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా వచ్చిన ‘దొరసాని’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తొలి సినిమా అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయినా.. నటిగా మాత్రం ఈ ముద్దుగుమ్మకు మంచి మార్కులే పడ్డాయి. ముఖ్యంగా శివాత్మిక ఎక్స్‌ప్రెషన్స్ చాలా బాగున్నాయంటూ ప్రశంసలొచ్చాయి. శివాత్మిక ప్రస్తుతం కృష్ణ వంశీ దర్శకత్వంలో వస్తున్న రంగ మార్తండలో నటిస్తోంది. తాజాగా శివాత్మిక గురించి మరో న్యూస్ కూడా బయటకు వచ్చింది.

శివాత్మిక రాజశేఖర్.. కోలీవుడ్‌లో అడుగు పెట్టేందుకు సన్నాహాలు చేసుకుంటోందట. ఇప్పటికే ఒక అద్భుతమైన అవకాశం ఈ ముద్దుగుమ్మ చేజిక్కించుకుంది. గౌతమ్ కార్తీక్ లీడ్ రోల్ పోషిస్తున్న సినిమాలో శివాత్మిక అవకాశం దక్కించుకుంది. నంద పెరియాసామి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మార్చి నుంచి ప్రారంభం కానుంది. ఈ సినిమా హిట్ అయితే శివాత్మిక కెరీర్‌కి మంచి టర్నింగ్ పాయింట్ అవుతుంది.

More News

‘జాతిరత్నాలు’: లైఫ్‌ అండ్‌ డెత్‌ సమస్యకు కామెడీని మిక్స్ చేశారు

న‌వీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ‌, ప్రియ‌ద‌ర్శి టైటిల్ రోల్స్ పోషిస్తున్న చిత్రం 'జాతిర‌త్నాలు'. ఈ సినిమాలో ఫ‌రియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించింది.

ఇల్లందు జేకే మైన్స్‌ను సందర్శించిన కొరటాల.. 7 నుంచి షూటింగ్

సక్సెస్‌ఫుల్ దర్శకుడు కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవి కాంబోలో ‘ఆచార్య’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

టీటీడీని ధారాదత్తం చేసేందుకు కుట్ర: చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు

తిరుమల తిరుపతి దేవస్థానం విషయమై కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి డాక్టర్‌ చింతామోహన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మంచు మనోజ్ రెండో పెళ్లి ఎప్పుడంటే?

మంచు వారబ్బాయి త్వరలో పెళ్లికొడుకు కాబోతున్నాడు. మంచు మోహన్‌బాబు చిన్న కుమారుడు, హీరో మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం.

నోటికి పనిచెప్పిన కొడాలి నాని.. షాకిచ్చిన ఎస్‌ఈసీ

మంత్రి కొడాలి నాని మరోసారి నోటికి పని చెప్పారు. ఎన్నికల కమిషన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.